నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె పట్టణంలో టిడిపి సీనియర్ నాయకులు కట్టా దొరస్వామి నాయుడు ఆధ్వర్యంలో మంగళవారం తన కార్యాలయంలో హెచ్ఎం టీవీ న్యూస్ ఛానల్ వారు ప్రత్యేకంగా రూపొందించిన నూతన సంవత్సర (2026) క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సంధర్భంగా మదనపల్లె టౌన్ బ్యాంక్ డైరెక్టర్ దేవేందర్(చిన్ని) ... మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలకు, తిరుపతి, కుప్పం, మదనపల్లె నియోజకవర్గ ప్రజలకు, హెచ్ఎం టీవీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు, హెచ్ఎంటీవీ యాజమాన్యానికి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. హెచ్ఎం టీవీ న్యూస్ ఛానల్ ప్రజా సమస్యల మీద, పేద ప్రజల యొక్క వాణిని బలంగావినిపిస్తున్నందున హెచ్ఎం టీవీ న్యూస్ ఛానల్ ప్రజలలో మంచి ఆదరణ ఉందన్నారు. నిరంతరం అనేక కొత్త విషయాలను ఎప్పటికప్పుడు వెలుగులోకి "తెస్తూ ప్రజల పక్షాన నిలబడి మరింత హెచ్ఎంటీవీ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కిరణ్ బిజెపి టౌన్ ప్రెసిడెంట్, రామాపురం శ్రీన, గౌస్, హెచ్ఎంటీవీ శ్రీనివాసులు,తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News