Monday, 02 March 2026 06:50:45 AM
# ఘనంగా నిర్వహించిన టైలర్స్ డే వేడుకలు # విద్యా పర్యటన లో ఏపీ శాసనసభ ను సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తంబళ్లపల్లె లో 30 వేల జనసేన సభ్యత్వమే మా లక్ష్యం -మైఫోర్స్ మహేష్ # తంబళ్లపల్లె లో ఘనంగా మాదిగ అమరవీరుల సంస్మరణ సభ # చెట్టు పై నుండీ పడి రైతు కు గాయాలు # చిన్నారి పుట్టినరోజు వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # కనబడకుండా పోయిన వ్యక్తి దారుణ హత్య # తంబళ్లపల్లె టిడిపి ఇన్చార్జిగా జి శంకర్... ? # గ్రీన్ అంబాసిడర్లకు చెత్త వాహనాలు పంపిణీ # తంబళ్లపల్లెలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు 93.44% పంపిణీ # మార్చి 5వ తేదీలోగా 100% ఇండ్ల పన్ను వసూలు చేయాలి - డి.ఎల్.పి.ఓ. నాగరాజు # ప్రధానమంత్రి గ్రామీణ రహదారి పథకం పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ # ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # మదనపల్లి పట్టణంలో 'ధర్నా చౌక్' ఏర్పాటు చెయ్యాలి - సీపీఎం డిమాండ్ # మిట్స్ లో ఘనంగా స్మృతి సంగమం-2026 # మిట్స్ లో ఘనంగా జాతీయ సైన్స్ డే # మెడికల్ మాఫియా ను అరికట్టాలంటూ డి.యం.హెచ్.ఓ. కార్యాలయం వద్ద సిపిఐ నిరసన # శ్రీరామ్ చినబాబు కు అభినందనల వెల్లువ # విశ్వం ఇంజినీరింగ్ కళాశాలలో CSE & AI & DS విభాగాల ఆధ్వర్యంలో వర్క్‌షాప్ # కృత్రిమ మేధస్సుతో శాస్త్ర విజ్ఞానానికి కొత్త దిశలు

మదనపల్లి పట్టణంలో 'ధర్నా చౌక్' ఏర్పాటు చెయ్యాలి - సీపీఎం డిమాండ్

Date : 28 February 2026 08:56 PM Views : 17

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 28 : మదనపల్లి పట్టణంలో 'ధర్నా చౌక్' ఏర్పాటు చెయ్యాలని సీపీఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం జిల్లా ఎస్పీ కి వినతిపత్రం అందచేసినట్లు ఆయన వివరించారు. శనివారం స్థానిక సీపీఎం కార్యాలయంలో శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కార్మిక సంఘాలు, సంస్థలు మరియు రాజకీయ పార్టీలు నిరసనలు తెలపడం ఒక రాజ్యాంగ హక్కు అని పేర్కొన్నారు. మదనపల్లి జిల్లా కేంద్రంగా మారిన తర్వాత ట్రాఫిక్ సమస్యలు పెరిగాయని, జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసనలకు పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారని దీనిని సీపీఎం తరఫున ఖండిస్తున్నట్లు తెలిపారు. నిరసనకారులకు ఇబ్బంది కలగకుండా, ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా మదనపల్లి పట్టణంలో ఒక ప్రత్యేక 'ధర్నా చౌక్'ను ఏర్పాటు చేయాల్సిన భాద్యత పోలీసులది కాదా అని ప్రశ్నించారు. ​పోలీసులు మున్సిపల్, రెవిన్యూ అధికారులతో సమన్వయం చేసుకుని ధర్నా చౌక్ ఏర్పాటు చెయ్యాలని కోరారు. చిత్తూరు బస్టాండ్ వద్ద ఉన్న ఖాళీ స్థలం ధర్నా చౌక్‌కు అనువుగా ఉంటుందని పార్టీ తరపున ప్రతిపాదిస్తున్నట్లు వివరించారు. అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలతో చర్చించి కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :