నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి - జూలై 28 : AISB క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం లో పాల్గొన్న రాష్ట్ర రవాణా,క్రీడా, యువజన శాఖ మంత్రి వర్యులు మండి పల్లి రాంప్రసాద్ రెడ్డి సోదరులు డాక్టర్ లక్ష్మి ప్రసాద్ రెడ్డి , రాహుల్ రెడ్డి , తదితరులు . రాయచోటి ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు రాయచోటి టౌన్ కి చెందిన యువత ఆధ్వర్యంలో నిర్వహించిన AISB క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ శ్రీ లక్ష్మీ ప్రసాద్ రెడ్డీ గారు వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా మరి ముఖ్యంగా రాయచోటి నియోజక వర్గంలో క్రీడలకు సంబంధించి అన్ని విధాలా ఎప్పుడు తోడ్పాటు ను అందిస్తాం అని పేర్కొన్నారు ముఖ్యంగా యువత చెడు మార్గంవెైపు పోకుండా క్రీడల వైపు ఆసక్తి చూపే విధంగా భవిష్యత్తు లో రాష్ట్ర క్రీడా యువజన, రవాణా శాఖా మంత్రి వర్యులు శ్రీ మండి పల్లి రాంప్రసాద్ రెడ్డి సహకారంతో మరింత క్రీడా అబివృద్ధి కి కృషి చేస్తాం అన్నారు,ఇప్పటికే జిల్లా స్పోర్ట్స్ ఆధ్వర్యంలో అన్ని మండలాలు కు వాలీబాల్ కోర్టు లఆభివృద్ధికి శ్రీకారం చుట్టాము అన్నారు భవిష్యత్తు లో కూడా ఇండోర్ స్టేడియం నిర్మించి జిల్లాలో మరింత క్రీడా అబివృద్ధి కి కృషి చేస్తాం అని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు
Admin
Namitha News