నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 11 : దేశ స్వాతంత్రం కోసం పొరాటం చేసి దేశం గర్వించదగ్గ మహా ధీశాలి వడ్డే ఓబన్న చిరస్మరణీయుడని మండల వడ్డెర సంఘ అధ్యక్షుడు రేపన మల్లికార్జున కొనియాడారు.ఆదివారం తంబళ్లపల్లె లో వడ్డే ఓబన్న జయంతిని మండలం లోని వడ్డెర నాయకులు ఘనంగా నిర్వహించారు.ఆయన చిత్రపటానికి పూజలు నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు.భారీ కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు.పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి వడ్డే ఓబన్న అమర్ రహే నినాదాలతో హోరెత్తించారు.వడ్డే ఓబన్న స్ఫూర్తితో వడ్డెర జాతి బిడ్డలు విద్య తోబాటు అన్ని రంగాలలో అభివృద్ధి వైపు నడవాలని వక్తలు సూచించారు.ఈ కార్యక్రమంలో పూజారి వెంకటరమణ, డేరంగుల చంద్ర, రేపన చౌడేశ్వర, మహిళా నాయకురాలు రామలక్ష్మమ్మ, రేపన సిద్ధమల్లు, తేపల్లె రెడ్డప్ప, ఉప్పుతోళ్ల శివరాం, అశోక్, పురుషోత్తం, రేపన బాబు, శ్రీనివాసులు, మహేష్, శంకర, జస్వంత్, నవీన్, హరి, జానకి రామ్, రెడ్డి శేఖర్, శివ కేశవ, రెడ్డి ప్రతాప్, రామాంజులు, శివ శంకర, రెడ్డప్ప, తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News