నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 14 ః కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంలో సోలార్ విద్యుత్తు కనెక్షన్ తీసుకుంటే భవిష్యత్తులో విద్యుత్ ఆదాతో పాటు ప్రతి కుటుంబానికి సోలార్ ఓ ఆదాయ వనరుగా మారుతుందని విద్యుత్ శాఖ ఏడి గోవిందరెడ్డి సూచించారు. ఆదివారం ఆయన ఏఈ సురేంద్ర తో కలిసి తంబళ్లపల్లె, గోపిదిన్నె సబ్ స్టేషన్లు పరిశీలించి విద్యుత్తు సరఫరాపై ఆరాతీశారు. వర్షాకాలం దృశ్య విద్యుత్ లైన్లు పై ట్రీ కటింగ్ చేపట్టి విద్యుత్ సమస్యలు ఏర్పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు , రైతుల విద్యుత్ మోటార్ల వద్ద విద్యుత్ సరఫరా పై ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం ఎ.డి తంబళ్లపల్లె, ఇట్నేని వారి పల్లి తో పాటు పలు చోట్ల సోలార్ విద్యుత్ యూనిట్లను పరిశీలించారు.సోలార్ లబ్ధిదారులు సోలార్ తో నిరంతర విద్యుత్ పొందడం తోపాటు బిల్లులు చెల్లించే పని లేకుండా మాకు అదనంగా డబ్బు ఆదా అవుతున్నట్లు చెప్పడం విశేషం. ఈ సందర్భంగా ఏ.డి మాట్లాడుతూ మండలంలో విద్యుత్ శాఖ సిబ్బంది లబ్ధిదారులకు ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంలో సోలార్ విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేసుకుని తద్వారా వారికి లభించే లబ్ధిపై అవగాహన కల్పించాలని సూచించారు. విద్యుత్ బిల్లులు సకాలంలో వసూళ్లపై సిబ్బంది దృష్టి సారించాలని విద్యుత్ సబ్స్టేషన్ల పరిధిలో రైతులు, కక్షిదారులు సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. ఆయన వెంట లైన్ ఇన్స్పెక్టర్ భాస్కర్, లైన్మెన్ శంకర్, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు
Reporter
Namitha News