నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 18 : బి.కొత్తకోట మండలం గోళ్ళ పల్లి గ్రామం చిట్టెం రెడ్డి గారి పల్లికి చెందిన తాను తన తల్లిదండ్రులను పోషించినందుకుగాను తండ్రి వి. వెంకటప్ప కొంత ఆస్తిని తన పేరు పైన వీలునామాను రాసి రిజిస్టర్ చేసి ఇవ్వడం జరిగిందని బాధితుడు వి. చిన్నప్ప తెలిపారు. అయితే తాను జీవనోపాధి కోసం తాను తన కుటుంబ సభ్యులు, తల్లి తండ్రులతో కలసి వలస వెళ్లడం జరిగిందని అవేదన వ్యక్తం చేశారు. తాను ఊర్లో లేని సమయం లో తన సోదరుడు వి.సురేంద్ర తనకు చెందిన భూమి కి సంబంధించి పాస్ పుస్తకం చేయించు కోని, అ భూమి ని వేరే వారికి అమ్ము కోవడం జరిగిందని సోమవారం పిజిఆర్ఎస్ లో జిల్లా కలెక్టర్ కి పిర్యాదు చేస్తూ వినతి పత్రం అందజేశారు. దీనిపై విచారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్బంగా బాధితుడు చిన్నప్ప మాట్లాడుతూ తాను జీవనోపాధి కోసం మరియు పిల్లలను చదివించుకోవటానికి తల్లిదండ్రులతో కలిసి కడప కు వలస వెళ్లడం జరిగిందన్నారు. తల్లి దండ్రులను పోషించి నందుకుగాను తన తండ్రి కొంత ఆస్తిని వీలునామాగా రాసి తనకు 40/బికె 3/2010 మేరకు రిజిస్టర్ చేయించి ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. ఈ వీలు నామ ద్వారా తనకు పలు సవ్వే నెంబర్లు నుండి భూమి సంక్ర మించడం జరిగిందని వివరించారు. అయితే తన ప్రమేయం లేకుండా తన భూమికి పాస్ చేసుకుని, వేరే వారికి అమ్ము కోవడం జరిగిందని, దీనిపై విచారణ జరిపి తనకు చెందిన భూమి ని తిరిగి తనకే దక్కే విదంగా పట్టా దారు పాస్ పుస్తకం మంజూరు చేసి, నిబంధనలను అతిక్ర మించిన వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు. తనకు గాని, తన తల్లి తండ్రులకు ఇందులో ఏలాంటి సమాచారం లేకుండా చట్ట విరుద్ధంగా జరిపిన వ్యవహారం లో తనకు న్యాయం చేయాలని కోరారు
Reporter
Namitha News