నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి. కొత్తకోట - ఆగస్ట్ 07: భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ బీ.కొత్తకోట పట్టణంలో ప్రజా సమస్యలపై చేపట్టిన పాదయాత్ర కార్యక్రమం రెండవ రోజు దిగ్విజయంగా సాగింది. శుక్రవారం బీసీ కాలనీ, బెంగళూరురోడ్,మగ్గాల వీధి,బిలాల్ మసీదు వీధి,చర్చివీధులలో ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేస్తూ,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను వివరిస్తూ కొనసాగిన పాదయాత్రకు ప్రజల నుంచి ముఖ్యంగా మహిళల నుండి విశేష స్పందన వచ్చింది.పలు సమస్యలను సిపిఐ నాయకులకు తెలియజేశారు.సదరు సమస్యలు సాధన కోసం సిపిఐ నిరంతరం శ్రమిస్తుందని పాదయాత్ర బృందం ప్రజలకు హామీ ఇచ్చారు.ఈ పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి టి.కృష్ణప్ప, నియోజకవర్గపు కార్యదర్శి ఎస్.మనోహర్ రెడ్డిలు మాట్లాడుతూ;పట్టణంలోని ప్రజానీకం అనేక సమస్యలను తమకు వివరించారని, ముఖ్యంగా మౌలిక సదుపాయాలు కల్పించడంలో అధికారులు చిత్తశుద్ధి చూపడం లేదని,అలాగే పక్కాఇండ్లు,పింఛన్లు తమకు మంజూరు కాలేదని చెప్పారని అన్నారు.అలాగే కొందరు మహిళలు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నిత్యావసర వస్తువుల ధరలు,వంటగ్యాస్ సిలిండర్ ధరలు పెంచేశారని, వీటికి తోడు కరెంటు చార్జీలు,ఇంటి పన్నులు పెంపు కూడా చాలా దారుణమని ఆవేదన చెందారని వారన్నారు.సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే పోరాటాలే మార్గమని, సిపిఐ చేపట్టిపోయే పోరాటాలలో యువకులు,మహిళలు కార్మికులు,కర్షకులు అందరూ కూడా భాగస్వామ్యం కావాలని వారు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు ఎస్.బషీర్ ఖాన్,మండల కార్యదర్శి జి.రఘునాథ్,పట్టణ కార్యదర్శి ఎం.అష్రఫ్అల్లి,మండల నాయకులు హెచ్.షమీవుల్లా,బి.వేణుగోపాల్ రెడ్డి,ఎం.గంగులప్ప,పి.రామచంద్ర,బాబాజాన్,షాకీర్,షఫీ,రియాజ్,కాటమరాయుడు,గంగులప్ప తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News