Sunday, 13 September 2026 07:40:11 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

మల్లయ్య కొండ తవ్వకాలపై వైసీపీ దుష్ప్రచారం_ భక్తుల ప్రజల మనోభావాలు మాకు ముఖ్యం.

భ్రమరాంబిక మల్లికార్జున స్వామిని దర్శించుకున్న టిడిపి ఎమ్మెల్యే లు

Date : 30 June 2026 12:09 AM Views : 222

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబల్లపల్లి జూన్ 29 : మల్లయ్య కొండ, సాదుకొండ, ఇనుముకొండలలో ఇనుప ఖనిజాల కోసం తవ్వకాలు జరుపుతున్నారని, ప్రభుత్వం ఏదో చేసేస్తోందని తంబళ్లపల్లి వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, వైసీపీ నాయకులు ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టిస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. సోమవారం తంబళ్లపల్లి మల్లయ్య కొండపై వెలసిన శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డితో పాటు రాజంపేట పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు సుగువాసి ప్రసాద్ బాబు, మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాష పలువురు ప్రజా ప్రతినిధులు దర్శించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మల్లయ్య కొండ అంటే మా ప్రాంత ప్రజలకు పవిత్రమైన దైవ క్షేత్రం. ఇక్కడ మైనింగ్ తవ్వకాలు జరుగుతున్నాయని వైసీపీ నేతలు కావాలని అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. ప్రజల మనోభావాలతో చెలగాటం ఆడటమే వారి పని. అలాంటిది ఏదీ జరగడం లేదు, జరగనివ్వమని స్పష్టం చేశారు.8 గతంలో 2011లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తవ్వకాల కోసం ప్రచారం జరగడంతో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టారని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడుకు విమర్శించే అర్హత మీకు లేదని ఆయన హెచ్చరించారు. జనవరి నెల 22వ తేదీ 2024 సంవత్సరంలో ఎర్ర కొండకు టెండర్లు పిలిచింది వైసీపీ ప్రభుత్వమేనని మళ్లీ ప్రభుత్వం పైన బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఇలాంటి ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరించారు. భక్తులు,ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలన్నదే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం, అదే మా కర్తవ్యం. మల్లయ్య కొండ,మల్లికార్జున గుడి మా ప్రజల విశ్వాసం. ఆ విశ్వాసాన్ని కాపాడటం మా బాధ్యత. ప్రజలు ఎలాంటి అపోహలకు, వైసీపీ రెచ్చగొట్టే మాటలకు లోనుకావొద్దు. ప్రభుత్వం ఎప్పుడూ ప్రజల పక్షానే ఉంటుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో కొండలను, గుట్టలను కొల్లగొట్టిన వారే ఇప్పుడు దొంగే దొంగ అన్నట్టు మాట్లాడటం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ప్రజల ఆస్తులను, దేవుళ్ల మాన్యాలను కంటికి రెప్పలా కాపాడుతుందని తేల్చిచెప్పారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా,రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు,రాష్ట్ర బిసి మహిళా అధ్యక్షురాలు పర్వీన్ తాజ్,రాష్ట్ర బిసి సెల్ అధ్యక్షుడు త్యాగరాజు,ఆర్ జే వెంకటేష్,కట్టదోరస్వామి నాయుడు,కొండ్రేడ్డి అరుమండలాల టీడీపీ మండల అధ్యకులు,టిడిపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :