నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 10: జిల్లాలో మాదకద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం మోపుతున్న పోలీసు యంత్రాంగం మరో భారీ గంజాయి స్మగ్లింగ్ను ఛేదించింది. ఉల్లిపాయల వ్యాపారం ముసుగు లో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి తరలిస్తున్న ముఠాను మదనపల్లె తాలూకా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.
మంగళవారం జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మీడియాకు వివరాలు వెల్లడిస్తూ మదనపల్లె డీఎస్పీ మహేంద్ర పర్యవేక్షణలో మదనపల్లె తాలూకా ఇన్స్పెక్టర్ కళా వెంకటరమణ మరియు సిబ్బంది నిన్నటి దినం 9వ తేదీన మదనపల్లె – తిరుపతి ప్రధాన రహదారిలోని యర్రగానిమిట్ట వద్ద వాహనాల తనిఖీ చేపట్టే సమయం లో ఒక నంబర్ లేని లగేజీ ఆటోను తనిఖీ చేయగా, పైన ఉల్లిపాయల బస్తాలు పేర్చి ఉన్నాయి. పోలీసులకు అనుమానం వచ్చి లోతుగా తనిఖీ చేయగా, ఉల్లిపాయల కింద తొమ్మిది బస్తాల్లో దాచిన దాదాపు 179 కేజీల గంజాయి బయటపడింది. దీని విలువ సుమారు రూ. 44,65,000/- అక్షరాలా నలభై నాలుగు లక్షల అరవై ఐదు వేల రూపాయలు నగదు ను, ఆటో ను స్వాధీనం చేసుకొని చంద్రా కాలనీ కు ఆవుల నాగరాజ 23 సం, ఆవుల సుగుణ నాగరాజ 19 అను ఇద్దరిప, వీరి ముఠా లోని నలుగురు ముద్దాయిలను అరెస్టు చేయాల్సి ఉందని వెల్లడించిన ఎస్పీ ధీరజ్ కునుబిల్లి
Admin
Namitha News