నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - సెప్టెంబర్ 09 : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మూడేళ్ల క్రితం వైకాపా 53 రోజుల అక్రమ అరెస్ట్ చీకటి రోజులు తొలగిన సందర్భంగా టిడిపి నాయకులు 53 దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు. క్రాస్ రోడ్ ఎన్టీఆర్ ఘాట్లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ ఆదేశాల మేరకు బుధవారం సాయంత్రం మండల టిడిపి అధ్యక్షుడు రెడ్డప్ప రెడ్డి, ఉపాధ్యక్షుడు మాజీ సర్పంచ్ కృష్ణమూర్తి నాయుడు, సిద్ధమ్మ ల ఆధ్వర్యంలో 53 దీపాల వెలుగులో చీకటి రోజులు తొలగాయి, వెలుగు దీపాలు వెలుగుతున్నాయి, చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో బిసి యువ నాయకుడు పురుషోత్తం, మాజీ మల్లయ్య కొండ చైర్మన్ గంగుల్ రెడ్డి, తెలుగు యువత అధ్యక్షుడు గంగరాజు, నియోజకవర్గ ఉపాధ్యక్షుడు నరసింహులు, మాజీ జెడ్పిటిసి రామచంద్ర,కొటాల అల్లావుద్దీన్,ఎర్రసానిపల్లి సుధాకర్, రామచంద్రారెడ్డి, కన్నెమడుగు సోమశేఖర్, సురేంద్ర,ఎద్దులవారిపల్లి రమణ, నరసింహనాయుడు,నారాయణ కొండారెడ్డి, రషీద్ భాష, ధన శేఖర్, మహిళ నాయకురాలు రామ లక్ష్మమ్మ,, బాలకృష్ణారెడ్డి,ఐసుల కృష్ణ, జనసేన ఎద్దుల నరసింహులు, మురళీకృష్ణ,టిడిపి కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
Namitha News