Wednesday, 29 July 2026 11:05:38 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

తంబళ్లపల్లె తాగునీటి సమస్యల పరిష్కారానికి పెద్దపీట - జడ్పీ సీఈవో రవికుమార్ నాయుడు

Date : 08 May 2026 09:42 PM Views : 113

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 8 ః తంబళ్లపల్లె నియోజకవర్గం లోని తాగునీటి సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తున్నట్లు చిత్తూరు జడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు హామీ ఇచ్చారు. శుక్రవారం ఆయన నియోజకవర్గంలోని కురబలకోట, బి కొత్తకోట, పీటీఎం, మొలకల చెరువు, తంబళ్లపల్లె మండలాలలో సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా మండల పరిషత్ అధికారులు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, ప్రజా ప్రతినిధులు, అధికార పార్టీ నాయకుల తో సమీక్షలు జరిపి ఆయా మండలాలలో తాగునీటి సమస్యలపై ఆరా తీశారు. మండల్ పరిషత్, జిల్లా పరిషత్ నిధులు తాగునీటి సమస్యలకు వినియోగించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వేసవిలో తాగునీటి సమస్యలను అధిగమించి ముందస్తుగా మండల స్థాయి నుండి పంచాయితీ సచివాలయ వ్యవస్థ నుండి వచ్చే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారంలో మండల పరిషత్ అధికారులతో పాటు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అప్రమత్తంగా ఉండి పరిష్కరించగలిగామన్నారు. ఎక్కడైనా తాగునీటి సమస్య అధికారుల దృష్టికి వస్తే 24 గంటల లోపు పరిష్కారానికి ఆదేశాలు ఇస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా పారిశుద్ధ్యం మెరుగుకు స్వచ్ఛ్ ఆంధ్ర కార్యక్రమం ద్వారా అవగాహన పెంచడంతోపాటు స్వచ్ఛరథం నిర్వహణతో మారుమూల గ్రామాలలోని చెత్త సేకరణ కు వస్తు రూపేనా చెల్లింపు కార్యక్రమం విజయవంతం చేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు బురుజు లో పైప్ లైన్ సమస్య, తంబళ్లపల్లెలో మహిళలకు మరుగుదొడ్లు నిర్మాణాలపై యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ నిధులతో చేపట్టే పనులు నాణ్యత లోపం లేకుండా చూడాలని లేనిపక్షంలో కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. మల్లయ్య కొండ కింద మండల నిధులతో నిర్మించిన సిసి రోడ్డు పరిశీలించారు. ఆయన వెంట డి ఎల్ డి ఓ లక్ష్మీపతి,ఇన్చార్జ్ ఎంపీడీవో ఎం.వి ప్రసాద్, ఏవో థామస్ రాజా, ఏఈ వెంకటరమణ, కార్యదర్శి శ్రీనివాసరావు, ఎంపీపీ శ్యామల కోటిరెడ్డి, మండల టిడిపి అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, బేరిశ్రీనివాసులు, పురుషోత్తం, కాలా నారాయణ, దండు వెంకటరమణ,సోమశేఖర్, సురేంద్ర, రామచంద్ర, ఎంపీటీసీలు, వైకాపా నాయకులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: