నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 09 : అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం పాతూరు, పూలకుంట్లపల్లి గ్రామాలకు చెందిన కూలీలు కర్ణాటక రాష్ట్రం శ్రీనివాసపురం ప్రాంతానికి కూలి పనుల కోసం వెళ్లి తిరుగు ప్రయాణంలో వాహనం ప్రమాదవశాత్తు బోల్తా పడటంతో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందడం అత్యంత బాధాకరమని, విషాదం అంటూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీపీఐ నాయకులు. ఈ దుర్ఘటనలో గాయపడి మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కూలీలను సోమవారం పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అలాగే ప్రమాదానికి గల కారణాలపై గాయపడిన కూలీలను అడిగి వివరాలు సేకరించారు. పేద కూలీలు ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తున్న పరిస్థితి ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని సీపీఐ నాయకులు విమర్శించారు. మృతి చెందిన కూలీల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం ప్రకటించాలని. గాయపడిన కూలీలకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు పూర్తి ఖర్చులను ప్రభుత్వమే భరించాలని కోరారు
Admin
Namitha News