Saturday, 12 September 2026 05:36:05 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

తంబళ్లపల్లె రైతుల ఖాతా లలో రూ 5.38 కోట్ల పి.యం. కిసాన్, అన్నదాత సుఖీభవ నిధులు జమ

Date : 14 March 2026 08:18 AM Views : 491

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 13 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకాల ద్వారా తంబళ్లపల్లె మండలంలోని 8973 మంది రైతులకు రూ 5.38.38000 కోట్ల నిధులు రైతుల ఖాతాలకు జమ జరిగినట్లు సురేష్, రెడ్డిశేఖర్, నవ జోష్ణ లు తెలిపారు‍‌. శుక్రవారం తంబళ్లపల్లె సచివాలయంలో రైతులతో జరిగిన సమీక్షలో వారు అన్నదాత సుఖీభవ ద్వారా రూ 3.58.92000 కోట్లు పీఎం కిసాన్ ద్వారా రూ 1.79.46000 కోట్లు మొత్తం రూ 5.38.38000 కోట్లు రైతుల ఖాతాలో జమ అయ్యాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసిన ఈ నిధుల లబ్ధిదారుల పేర్లను గ్రామ సభకు వివరించారు. అన్నదాత సుఖీభవ నిధులు రైతుల ఖాతాలో పడని రైతులు తమ సమస్యలను వ్యవసాయ శాఖ అధికారుల దృష్టికి తెస్తే పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగాన్ని వీడియో ద్వారా రైతులకు వినిపించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, పెద్దేరు ప్రాజెక్టు చైర్మన్ కొటాల శివకుమార్, పురుషోత్తం, మాజీ జెడ్పిటిసి రామచంద్ర,తెలుగు యువత ఉపాధ్యక్షుడు నరసింహులు, చెరువు సంఘం అధ్యక్షుడు రామలింగారెడ్డి, బాలకృష్ణారెడ్డి, కాలా నారాయణ, సామిరెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షుడు మహేష్, బురుజు వెంకటరమణ, వెంకట్ రెడ్డి, శ్రీనివాసులు, రామాంజులు, డి ఎ సోమశేఖర్ రెడ్డి,రైతులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :