నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 13 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకాల ద్వారా తంబళ్లపల్లె మండలంలోని 8973 మంది రైతులకు రూ 5.38.38000 కోట్ల నిధులు రైతుల ఖాతాలకు జమ జరిగినట్లు సురేష్, రెడ్డిశేఖర్, నవ జోష్ణ లు తెలిపారు. శుక్రవారం తంబళ్లపల్లె సచివాలయంలో రైతులతో జరిగిన సమీక్షలో వారు అన్నదాత సుఖీభవ ద్వారా రూ 3.58.92000 కోట్లు పీఎం కిసాన్ ద్వారా రూ 1.79.46000 కోట్లు మొత్తం రూ 5.38.38000 కోట్లు రైతుల ఖాతాలో జమ అయ్యాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసిన ఈ నిధుల లబ్ధిదారుల పేర్లను గ్రామ సభకు వివరించారు. అన్నదాత సుఖీభవ నిధులు రైతుల ఖాతాలో పడని రైతులు తమ సమస్యలను వ్యవసాయ శాఖ అధికారుల దృష్టికి తెస్తే పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగాన్ని వీడియో ద్వారా రైతులకు వినిపించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, పెద్దేరు ప్రాజెక్టు చైర్మన్ కొటాల శివకుమార్, పురుషోత్తం, మాజీ జెడ్పిటిసి రామచంద్ర,తెలుగు యువత ఉపాధ్యక్షుడు నరసింహులు, చెరువు సంఘం అధ్యక్షుడు రామలింగారెడ్డి, బాలకృష్ణారెడ్డి, కాలా నారాయణ, సామిరెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షుడు మహేష్, బురుజు వెంకటరమణ, వెంకట్ రెడ్డి, శ్రీనివాసులు, రామాంజులు, డి ఎ సోమశేఖర్ రెడ్డి,రైతులు పాల్గొన్నారు.
Reporter
Namitha News