Wednesday, 16 September 2026 12:56:05 AM
# మొలకలచెరువు కల్తీ మద్యం కేసులో కోర్టులో లొంగిపోయిన టిడిపి నేత జయచంద్ర రెడ్డి , గిరిధర్ రెడ్డి # హంద్రీనీవా జలాలకు జి. శంకర్ యాదవ్ జలహారతి # వినాయక మండపం వద్ద విద్యుత్ లైన్ మెన్ శంకర్ భక్తులకు అన్నదానం # మహిళా సంఘాలకు 16 కోట్లు రుణాల పంపిణీకి సిద్ధం - ఇండియన్ బ్యాంక్ మేనేజర్ మంజూర్ ఇలాహి # విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో అన్నదానం - విద్యుత్ ఏడి గోవింద్ రెడ్డి # సమాజ సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు చూపే దిశగా సివిల్ ఇంజినీర్లు కృషి చేయాలి - శిరీష బండపల్లి # లబ్ధిదారులకు CMRF చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ # ఆత్మకూరు ను జల్లెడ పట్టిన పోలీసులు # కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # బొమ్మనచెరువులో పోలింగ్ కేంద్రాలపై పునఃపరిశీలించాలి - నిసార్ అహ్మద్ # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష

లింగ సమానత్వంపై ప్రజలకు అవగాహన కల్పించాలి

అవగాహన ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా

Date : 25 November 2025 08:08 PM Views : 233

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : లింగ సమానత్వంపై ప్రజలకు అవగాహన కల్పించాలి - అవగాహన ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా - ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పోస్టర్లు ఆవిష్కరణ - హాజరైన డిఆర్డిఏ పిడి నాగేశ్వరరావు వెల్లడి మదనపల్లె : లింగ వివక్షపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి బాలికలపై సదాభిప్రాయాన్ని పెంపొందించడంలో మహిళా సమఖ్యా గ్రూప్ సభ్యులు ప్రత్యేక దృష్టిపెట్టాలని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్నారు.మంగళవారం స్థానిక మదనపల్లి మహిళా మండల సమాఖ్య కార్యాలయంలో లింగ వివక్ష నిర్మూలన దినోత్సవంపై సమావేశం జరిగింది.ఈ సమావేశానికి మదనపల్లి మండల ఏపీఎం కిజర్ ఖాన్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే షాజహాన్ భాష,డిఆర్డిఎ పిడి నాగేశ్వరరావు,డిపిఎం ధర్మరాజు,సిడిపిఓ నాగవేణి,సూపర్వైజర్లు శ్వేత,,కళావతి,రామసముద్రం ఏపిఎం శివ,నిమ్మనపల్లి ఏపీఎం మురళి,వివో లీడర్లు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ భాష మాట్లాడుతూ మహిళా సమఖ్యా గ్రూప్ సభ్యులు రుణాలు తీసుకోవడంతో పాటు,బాధ్యతగా తిరిగి చెల్లించాలని స్పష్టం చేశారు.ఏదైనా అవసరాల కోసం బ్యాంకుల్లో రుణము తీసుకోవాలంటే అనేక షరతులకు లోబడి రుణం పొందాల్సి ఉంటుందని అయితే మహిళలకు ప్రభుత్వం ఆంక్షలు లేకుండా రుణాలు అందిస్తోందని వీటిని సద్వినియోగం చేసుకుని సకాలంలో తిరిగి చెల్లించి మహిళా సంఘాలు బలోపేతమయ్యే విధంగా అందరూ కృషి చేయాలని కోరారు.స్థలాలు,ఇండ్లు లేని వారు దరఖాస్తు పెట్టుకుంటే అందరికీ ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తూ అభివృద్ధి పథంలో తీసుకు వెళ్ళడానికి కృషి చేస్తుందని పేర్కొన్నారు.ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకాన్ని మహిళా సమఖ్యా గ్రూపు లీడర్లు,సభ్యులు సద్వినియోగం చేసుకొవాలని తెలిపారు.తద్వారా విద్యుత్ బిల్లులు చెల్లింపు బాధలకు ఉండవనన్నారు.అనంతరం పీడీ నాగేశ్వరరావు మాట్లాడుతూ మదనపల్లెలో లింగ వివక్ష దినోత్సవంపై ప్రజల్లో చైతన్యం తీసుకు రావడానికి,అన్ని ప్రభుత్వ శాఖలతో కలిసి ప్రజల్లో అవగాహన ర్యాలీని నిర్వహించడం జరిగిందని తెలిపారు.ఇప్పటికీ సమాజంలో లింగ వివక్షత జరుగుతోందని తద్వారా మహిళలు బాలికలు వివక్షకు గురవుతున్న సందర్భాలు నిత్యం జరుగుతున్నాయని చెప్పారు.వీటిని దూరం చేసే సదుద్దేశంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు తీసుకొచ్చిందన్నారు.ముఖ్యంగా స్త్రీ,పురుషుల మధ్య బాలికల బాల్య వివాహాలు,పిల్లలు చదువుల విషయంలో మార్పు తీసుకు రావడమే ముఖ్య ఉద్దేశ్యమన్నారు.ఈ కార్యక్రమంలో జాఫరున్నీ షా,వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు,మహిళా సమఖ్య సభ్యులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :