నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఆర్టీసీ కార్మికుల శ్రేయస్సుకి చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం - ఆర్టీసీ 1,2 డిపోల ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి స్పష్టం - బస్టాండ్ ఆవరణంలో ఘనంగా మే డే వేడుకలు మదనపల్లె : ఆర్టీసీ కార్మికుల శ్రేయస్సు కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని ఆర్టీసీ 1,2 డిపోల ఎంప్లాయిస్ యూనియన్ గౌరవాధ్యక్షులు నాగూర్ వలి (షో ఆప్ శీను) స్పష్టం చేశారు.శుక్రవారం మదనపల్లి బస్టాండ్ ఆవరణంలో మదనపల్లి 1,2 డిపోల ఎంప్లాయిస్ యూనియన్ సంయుక్త ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా 1,2 డిపోల ఎంప్లాయిస్ యూనియన్ గౌరవాధ్యక్షులు నాగూర్ వలి హాజరై ఎర్రజెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు బాగుంటేనే సంస్థల బాగుంటాయన్నారు.ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డిలు అధిక ప్రాధాన్యతనిస్తున్నారని కొనియాడారు.కార్మికులకు ఏవైనా ఇబ్బందులు పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నానని హామీ ఇచ్చారు.అదేవిధంగా కార్మికులందరికీ మే డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో ఎంప్లాయిస్ యూనియన్ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్.వి కుమార్,అన్నమయ్య జిల్లా ఎంప్లాయిస్ యూనియన్ చైర్మన్ పి.వి.బయ్యారెడ్డి,జిల్లా కార్యదర్శి బి.సాంబశివారెడ్డి,జిల్లా కమిటీ సభ్యులు జి.మధుసూదన్,పి.శారద,మదనపల్లి 1,2 ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్ష,కార్యదర్శులు కె.శివయ్య,కె.ఈశ్వరప్ప,నరసింహులు,ప్రచార కార్యదర్శి బి.ఎన్ స్వామి,సిఏ బాబు 1,2 డిపోల ఈయు నాయకులు,కమిటీ సభ్యులు,ముఖ్య నాయకులు,మహిళా సభ్యులు,గ్యారేజ్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Reporter
Namitha News