నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - మార్చి 18 : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టింది. ఇందులో భాగంగానే ఉగాది కానుకగా 'దివ్యాంగశక్తి' పేరుతో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రవేశపెట్టింది. మదనపల్లి ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో బుధవారం "దివ్యాంగ శక్తి" (దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం) కార్యక్రమాన్ని ప్రారంభించే కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ భాష తదితరులు. మదనపల్లి ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో బుధవారం "దివ్యాంగ శక్తి" (దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం) కార్యక్రమాన్ని ప్రారంభించే కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ భాష పచ్చజెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించి,i బస్సు పాసులను, జీరో బస్సు టికెట్లను స్వయంగా దివ్యాంగులకు అందజేశారు. దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణిస్తూ వారితో సెల్ఫీ దిగారు. అనంతరం వారి సమస్యలను, వారి అభిప్రాయాలను తెలుసుకొని సంబంధిత అధికారులకు తగిన సూచనలు చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని పిజిఆర్ఎస్ సమావేశం మందిరంలో దివ్యాంగులతో కలిసి భోజనం చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... ఈ రోజు నుండిదివ్యంగ శక్తి అమలు లోనికి రావడం ద్వారా 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులకు ఈ పథకం వర్తించనుంది. పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్. మెట్రో ఎక్స్ ప్రెస్, ఆర్జీనరీ, సిటీ బస్సుల్లో దివ్యాంగులు ఇకపై ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఇప్పటికే మహిళలకు. ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు దివ్యాంగులకు అవకాశం ఇవ్వడంతో సంతోషదాయకమని ఈ పథకం ద్వారా జిల్లాలో సదరం ద్వారా 40 శాతం కంటే ఎక్కువ వికలత్వం ఉన్న వారు 42,560 మంది దివ్యాంగులు ఉన్నారు. వీరంతా కూడా ఆర్టీసీలో దివ్యాంగశక్తి పథకం కింద ప్రయాణించవచ్చు.. ప్రభుత్వ సదుపా యాన్ని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు
ఈ సందర్భంగా మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ భాష మాట్లాడుతూ..ప్రభుత్వం వికలాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని వికలాంగులకు పెన్షన్లు అందిస్తున్నామని, అదేవిధంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మరో ముఖ్య నిర్ణయం తీసుకొని “దివ్యాంగ శక్తి” పథకం దివ్యాంగుల జీవితాల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే కీలక కార్యక్రమమని వారికి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిందన్నారు. వికలాంగులు ఎక్కడికైనా నిరభ్యంతరంగా ప్రయాణించేందుకు ఫ్రీ బస్ పాస్ సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఇది దేశంలోనే అరుదైన విషయమని ఇతర రాష్ట్రాల్లో కనిపించని ప్రత్యేక పథకమని ఆయన పేర్కొన్నారు.ప్రభుత్వం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తోందని, ముఖ్యంగా ఫిజికల్గా ఛాలెంజ్ ఉన్న వ్యక్తులకు భద్రత, ఆత్మవిశ్వాసం కల్పించడం తమ బాధ్యతగా ఈ ప్రభుత్వం భావిస్తున్నదని చెప్పారు. వికలాంగులు ఎలాంటి భయం లేకుండా సమాజంలో స్వేచ్ఛగా జీవించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా తోడ్పాటు అందిస్తుందని స్పష్టం చేశారు.ఈ పథకం ద్వారా వికలాంగుల జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు, వారి రోజువారీ అవసరాల కోసం ప్రయాణం సులభతరం అవుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ సదుపాయాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరారు
ఈ కార్యక్రమంలో ఆర్టీసీ రెండవ డిపో మేనేజర్ అమరనాథ్, వెలుగు సెక్రటరీ ఎం.ఉదయ్ మోహన్ రెడ్డి,దివ్యాంగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మౌలాలి, టిడిపి నాయకులు నవీన్ చౌదరి,బాలు స్వామి,బొమ్మిశెట్టి పురుషోత్తం,జంగాల వెంకటరమణ,కమలామర్రి కృష్ణ,ముసలికుంట నాగయ్య,మండిపల్లి మధుసూదన్ రెడ్డి,యర్రబల్లి వెంకటరమణా రెడ్డి,బోనాసి జాన్ బాబు,చల్లా నరసింహులు,బాబు నాయుడు,జీవి నాయుడు,రాధమ్మ,పులి మహాలక్ష్మీ,నాగమణి తదితరులు పాల్గొన్నారు.
Admin
Namitha News