Thursday, 30 July 2026 03:45:13 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

టీడీపీ కండువా వేసుకుంటేనే ట్రాన్స్‌ఫార్మర్

పీజీఆర్ఎస్ అర్జీలకే దిక్కే లేదని సీపీఐ ఆగ్రహం

Date : 25 May 2026 07:29 PM Views : 71

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : టీడీపీ కండువా వేసుకుంటేనే ట్రాన్స్‌ఫార్మర్ పెడతామంటున్నారు పీజీఆర్ఎస్ అర్జీలకు దిక్కే లేదని సీపీఐ ఆగ్రహం సర్పంచ్ అనుమతి తీసుకురావాలని, టీడీపీ పార్టీ కండువా వేసుకుంటేనే ట్రాన్స్‌ఫార్మర్ వెంటనే ఫిట్ చేయిస్తామని స్థానిక నాయకులు బెదిరిస్తున్నారని సీపీఐ మదనపల్లి నియోజకవర్గ కార్యదర్శి కే. మురళి ఆరోపించారు. గాలివీడు మండలం దానంరెడ్డిగారిపల్లి పంచాయితీకి చెందిన రైతు పుల్లారెడ్డికి వెంటనే కరెంట్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం సీపీఐ ఆధ్వర్యంలో పీజీఆర్ఎస్‌లో జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కే. మురళి మాట్లాడుతూ గత ఏడాదిన్నర కాలంగా రైతు పుల్లారెడ్డి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు. ట్రాన్స్‌ఫార్మర్ కోసం ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించినప్పటికీ, ట్రాన్స్‌ఫార్మర్ శాంక్షన్ అయినా కూడా రైతు పొలంలో ఫిట్ చేయలేదన్నారు. విద్యుత్ అధికారులను ప్రశ్నిస్తే స్థానిక సర్పంచ్ అనుమతి తీసుకురావాలని చెబుతున్నారని, సర్పంచ్‌ను సంప్రదిస్తే “మా పార్టీ కండువా వేసుకుంటే వన్‌డేలో ట్రాన్స్‌ఫార్మర్ ఫిట్ చేయిస్తాం, లేకపోతే పని జరగదు” అని సమాధానం ఇస్తున్నారని ఆరోపించారు ఈ సమస్యపై ఇప్పటికే మార్చి నెలలో పీజీఆర్ఎస్‌లో కలెక్టర్‌కు అర్జీ ఇచ్చామని, మూడు నెలలు గడిచినా ఇప్పటివరకు సంబంధిత అధికారులు స్పందించలేదన్నారు. దీంతో మళ్లీ స్పందన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయాల్లో ప్రజలు ఎంతో ఆశతో అర్జీలు ఇస్తున్నా అధికారులు వాటిని చెత్తబుట్టలో వేస్తున్నారే తప్ప ప్రజా సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి కనిపించడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పీజీఆర్ఎస్ వల్ల ప్రజలకు న్యాయం జరగడం లేదని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రజలకు తక్షణ న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పట్టణ కార్యదర్శి మాధవ్ కుమార్, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :