నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 01 : మాదిగల ఎస్సీ వర్గీకరణ ఉద్యమం లో తృణప్రాయంగా అసువులు బాసిన మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవం తంబళ్లపల్లెలో మాదిగ సోదరులు ఘనంగా నిర్వహించారు. క్రాస్ రోడ్ లో అమరవీరుల చిత్రపటాలకు పూజలు నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. వారు చేసిన త్యాగాలతో సాధించిన ఎస్సీ వర్గీకరణ తో మాదిగ బిడ్డల భవిష్యత్తు వారికి అంకితమని మండల ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు ఎద్దుల గంగాధర్, ఇంచార్జ్ వేట మల్లికార్జునలు కొనియాడారు. అమరవీరుల త్యాగాల్ని మాదిగ సోదరులు ఎలుగెత్తి చాటాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బండ్రేవు రమణ, కదిరిప్ప, రమేష్ స్వామి, ఆటో డ్రైవర్ రమణ, కదిరప్ప, నరసింహులు, ఎమ్మార్పీఎస్, ఎం ఎస్ పి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
Namitha News