నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లెలో సంక్రాంతి సంబరాలను గురువారం వేడుకగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక నిరుగట్టువారిపల్లి చౌడేశ్వరి నగర్ వాసులు బోగిమంటలు, రంగవల్లులు చిట్లకుప్పవేసి గోవులను బెదిరింపు కార్యక్రమం వేడుకలు జరుపుకున్నరు. ఈ వేడుకలను స్థానిక టిడిపి సినియర్ నాయకుడు కందికట్ల జయ ప్రారంభించి సంతోషంగా గడిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ భవష్యత తరాల వారికి మన సాంప్రదాయాలు, కట్టుబాటులు, పండుగలు గుర్తుఉండేలా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్, మోడం మహేష్, బొమ్మిశెట్టి శ్రీనివాసులు, భద్ర, మణి, తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News