నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె : జూన్ 10 ః వెలుగు మహిళా సంఘాలకు భవిష్యత్తులో స్త్రీనిధి క్రెడిట్ పాలసీ వర ప్రధాయనిగా నిలుస్తుందని మహిళా సంఘ సభ్యులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వెలుగు ఏపీఎం గంగాధర్ కోరారు. బుధవారం వెలుగు కార్యాలయంలో స్త్రీనిధి మేనేజర్ అమరావతి గ్రామ సమాఖ్య సభ్యుల సమావేశంలో 2026-2027 ఆర్థిక ఏడాదిలో స్త్రీనిధి గరిష్ట రుణ పరిమితుల లో వివో, ఎస్ హెచ్ జి లలో ఏ, బి,సి,డి గ్రేడులుగా ప్రతిపాదించిన నూతన రుణ పరిమితులకు అనుగుణంగా అర్హతలను బట్టి రుణాల పంపిణీ జరుగుతుందన్నారు. పదిమంది సభ్యులకు వినియోగ, జీవనోపాధి రుణం ఒక్కొక్కరికి లక్ష గరిష్టంగా రూ10 లక్షలు, స్వల్పకాలిక రుణం ఒక్కొక్కరికి రూ10వేలు, గరిష్టంగా 10 మందికి లక్ష, ఎంటర్ పైజ్ (ఉత్పాదక)రుణం సంఘంలో ముగ్గురికి ఒక్కొక్కరికి రూ 2లక్షలు, గ్రూపు గరిష్టంగా రూ 6లక్షలు, అర్హతను బట్టి ఒక సభ్యురాలికి గరిష్టంగా సాధారణ రుణం లక్ష, షార్ట్ టర్మ్ రుణం రూ 10వేలు, ఎంటర్ పైజ్ రుణం రెండు లక్షలు మొత్తంగా రూ 3.10 లక్షల రుణం పొందవచ్చన్నారు
Reporter
Namitha News