Friday, 19 June 2026 03:22:50 PM
# ప్రతి డంపింగ్ యార్డ్ ఓ బృందావనం కావాలి - ఎంపీడీవో ఉషారాణి # ఎస్.ఐ.ఆర్. సర్వే పారదర్శకంగా పూర్తి చేయాలి - ఆర్వో మాధవ కృష్ణారెడ్డి # విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ పనితీరు బాగుంది - తహసీల్దార్ శ్రీనివాసులు # గ్రామ పంచాయతీల అభివృద్ధిపై శిక్షణా తరగతులు # డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి బిడ్డను చదివించండి # మొండివారిపల్లి రహదారి సమస్య పరిష్కరించండి # టెలికాం అడ్వజరి మెంబరు గా బాధ్యతలు స్వీకరించిన వైసీపీ నేత షరీఫ్‌ # రాష్ట్ర వ్యాప్తంగా 43 మoది వైద్యుల డిస్మిస్ # మైక్రో మొబిలిటీ ఈ-ట్రైక్ ను ఆవిష్కరణ చేసిన మిట్స్ విద్యార్థులు # మాజీ సియం జగన్ ఈ నెల 28వ తేదీ మదనపల్లి పర్యటనకు అనుమతి ఇవ్వండి - నిసార్ అహమ్మద్ # ఘనంగా బి.సి.వై అధినేత జన్మదిన వేడుకలు, విజయంతం గా జాబ్ మేళా # విజయోత్సవ సభ కు పుంగనూరు తెలుగు తమ్ముళ్ల బైక్ ర్యాలీ # మొలకల చెర్వు ఉపాధ్యాయురాలి మృతి పై ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి # ఈ ప్రభుత్వ పాఠశాల కు బలే డిమాండ్ # మునిసిపాలిటీ పరిధిలోని సచివాలయాల్లో సర్వే డేటా ప్రదర్శన # మదనపల్లి లో 2ఏండ్ల నమ్మకం - సూపరిపాలన జిల్లా స్థాయి విజయోత్సవ సభ # తంబళ్లపల్లి టిడిపి ఇంచార్జ్ జి. శంకర్ ...? # పీలేరు సీఐ గా వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ # కాంట్రాక్టు నర్సు ల వేతనాలు చెల్లించాలని విజయవాడ లో నిరసన తెలిపిన నర్సులు # సోలార్ విద్యుత్తుతో ప్రతి ఇంటికి ఆదాయ వనరులు

మదనపల్లి లో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్

చంద్ర కాలనీ, వాల్మీకి నగర్ లక్ష్మీనగర్, మంజునాథ కాలనీల్లో 11 బృందాలు గా 125 మంది సిబ్బందితో ఆకస్మిక తనిఖీలు

Date : 23 April 2026 11:18 AM Views : 141

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 23 : అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు మదనపల్లి డియస్పి పావని ఆధ్వర్యంలో జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా నేటి వేకువజామున మదనపల్లి పట్టణంలోని పలు కాలనీ లలో కార్డ్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు. మదనపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్ర కాలనీ వాల్మీకి నగర్, లక్ష్మీనగర్, మంజునాథ కాలనీ లలో పోలీసులు వేకువజామున ఒక్కసారిగా 11 బృందాలుగా 125 మంది పోలీస్ సిబ్బంది తనిఖీలు చేసి సరైన పత్రాలు లేని 10 మోటార్ సైకిళ్లు, 3 ఆటోలను స్వాధీనం చేసుకొన్నారు

ఈ సందర్బంగా స్థానికులతో ముఖాముఖి నిర్వహించి ప్రజల భద్రతే మా బాధ్యత, లక్ష్యం అని తెలియచేస్తూ శాంతి భద్రతల నేపథ్యంలోనే ఈ తనిఖీలని తెలియచేస్తూ అపరిచిత వ్యక్తులు లేదా అనుమానాస్పద కార్యకలాపాలపై ఆరా తీశారు. ముఖ్యంగా మాదక ద్రవ్యాల కేసుల్లో పాత నిందితుల కదలికలు, నేర నియంత్రణ కొరకు అక్రమ కార్యకలాపాల నిరోధమే ధ్యేయంగా కాలనీల్లో కొత్త వ్యక్తులు, అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి పోలీసులకు సహకరించాలని కోరిన పోలీసులు

ఈ తనిఖీల కార్యక్రమంలో మదనపల్లి టూ టౌన్ సీఐ మహమ్మద్ రఫీ, తాలూకా సీఐ కళా వెంకటరమణ, రూరల్ సీఐ రవి నాయక్, వివిధ స్టేషన్ల ఎస్సైలు మదనపల్లి టూ-టౌన్ ఎస్ఐలు, నాగేశ్వరరావు, రామాంజనేయులు,నిమ్మనపల్లి యస్.ఐ. రామకృష్ణ , ముదివేడు యస్. ఐ. మధు రామచంద్రుడు, తాలూకా యస్.ఐ. చంద్రమోహన్, చౌడేపల్లి యస్.ఐ. చిన్న రెడ్డెప్ప, సదుం యస్.ఐ. విష్ణునారాయణ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :