Sunday, 03 May 2026 09:17:17 PM
# కోసువారిపల్లె జలధార పనులలో కదం తొక్కుతున్న కూలీలు # సోమవారం న వారపు సంతల వేలం పాటలు # మల్లయ్య కొండ గోమాతలకు పశు గ్రాసం వితరణ # క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ళు 5గురు అరెస్టు, నగదు 3.59లక్షల రూ స్వాధీనం # లబ్దిదారులకు CMRF చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ # అవతార్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష # ప్రశాంతం గా మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ # చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ లో అన్నదాన వితరణ చేసిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏబీఓ కిరణ్ మరియు వారి కుటుంబ సభ్యులు # పదవ తరగతి ఫలితాలు.. తండ్రీ కూతుళ్లు కలిసి ఉత్తీర్ణులయ్యారు # రెడ్డి కోట వద్ద గొర్రెల బొలోరో వాహనం బోల్తా-ఇరువురు దుర్మరణం # మాజీ సియం నాదెండ్ల భాస్కరరావు గారి స్మృతి లో పలువురు సినీ రాజకీయ, ప్రముఖులు # డిప్యూటీ సియం పవన్ కళ్యాణ్ ను పరామర్శించిన సియం చంద్రబాబు # జనసేన ప్రధాన కార్యదర్శి ని కలిసిన అన్నమయ్య జిల్లా జనసేన నాయకులు # పది ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సత్కరించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష # సప్లై ఛానల్ పూడికతీత పనులకు ఎమ్మెల్యే షాజహాన్ భూమి పూజ # మాజీ సియం నాదెండ్ల భాస్కరరావు మృతి ఉమ్మడి రాష్ట్రాలకు తీరని లోటు # పుంగనూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీరాములు సస్పెండ్ # చదళ్ళ చౌడేశ్వరి దేవి కి ప్రత్యేక పూజలు # మైనర్ బాలిక ను తల్లి ని చేసిన జాహిద్ అరెస్టు # ఆర్టీసీ కార్మికుల శ్రేయస్సుకి చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం - గౌరవాధ్యక్షులు నాగూర్ వలి

మదనపల్లి లో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్

చంద్ర కాలనీ, వాల్మీకి నగర్ లక్ష్మీనగర్, మంజునాథ కాలనీల్లో 11 బృందాలు గా 125 మంది సిబ్బందితో ఆకస్మిక తనిఖీలు

Date : 23 April 2026 11:18 AM Views : 95

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 23 : అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు మదనపల్లి డియస్పి పావని ఆధ్వర్యంలో జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా నేటి వేకువజామున మదనపల్లి పట్టణంలోని పలు కాలనీ లలో కార్డ్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు. మదనపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్ర కాలనీ వాల్మీకి నగర్, లక్ష్మీనగర్, మంజునాథ కాలనీ లలో పోలీసులు వేకువజామున ఒక్కసారిగా 11 బృందాలుగా 125 మంది పోలీస్ సిబ్బంది తనిఖీలు చేసి సరైన పత్రాలు లేని 10 మోటార్ సైకిళ్లు, 3 ఆటోలను స్వాధీనం చేసుకొన్నారు

ఈ సందర్బంగా స్థానికులతో ముఖాముఖి నిర్వహించి ప్రజల భద్రతే మా బాధ్యత, లక్ష్యం అని తెలియచేస్తూ శాంతి భద్రతల నేపథ్యంలోనే ఈ తనిఖీలని తెలియచేస్తూ అపరిచిత వ్యక్తులు లేదా అనుమానాస్పద కార్యకలాపాలపై ఆరా తీశారు. ముఖ్యంగా మాదక ద్రవ్యాల కేసుల్లో పాత నిందితుల కదలికలు, నేర నియంత్రణ కొరకు అక్రమ కార్యకలాపాల నిరోధమే ధ్యేయంగా కాలనీల్లో కొత్త వ్యక్తులు, అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి పోలీసులకు సహకరించాలని కోరిన పోలీసులు

ఈ తనిఖీల కార్యక్రమంలో మదనపల్లి టూ టౌన్ సీఐ మహమ్మద్ రఫీ, తాలూకా సీఐ కళా వెంకటరమణ, రూరల్ సీఐ రవి నాయక్, వివిధ స్టేషన్ల ఎస్సైలు మదనపల్లి టూ-టౌన్ ఎస్ఐలు, నాగేశ్వరరావు, రామాంజనేయులు,నిమ్మనపల్లి యస్.ఐ. రామకృష్ణ , ముదివేడు యస్. ఐ. మధు రామచంద్రుడు, తాలూకా యస్.ఐ. చంద్రమోహన్, చౌడేపల్లి యస్.ఐ. చిన్న రెడ్డెప్ప, సదుం యస్.ఐ. విష్ణునారాయణ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :