నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 23 : అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు మదనపల్లి డియస్పి పావని ఆధ్వర్యంలో జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా నేటి వేకువజామున మదనపల్లి పట్టణంలోని పలు కాలనీ లలో కార్డ్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు. మదనపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్ర కాలనీ వాల్మీకి నగర్, లక్ష్మీనగర్, మంజునాథ కాలనీ లలో పోలీసులు వేకువజామున ఒక్కసారిగా 11 బృందాలుగా 125 మంది పోలీస్ సిబ్బంది తనిఖీలు చేసి సరైన పత్రాలు లేని 10 మోటార్ సైకిళ్లు, 3 ఆటోలను స్వాధీనం చేసుకొన్నారు
ఈ సందర్బంగా స్థానికులతో ముఖాముఖి నిర్వహించి ప్రజల భద్రతే మా బాధ్యత, లక్ష్యం అని తెలియచేస్తూ శాంతి భద్రతల నేపథ్యంలోనే ఈ తనిఖీలని తెలియచేస్తూ అపరిచిత వ్యక్తులు లేదా అనుమానాస్పద కార్యకలాపాలపై ఆరా తీశారు. ముఖ్యంగా మాదక ద్రవ్యాల కేసుల్లో పాత నిందితుల కదలికలు, నేర నియంత్రణ కొరకు అక్రమ కార్యకలాపాల నిరోధమే ధ్యేయంగా కాలనీల్లో కొత్త వ్యక్తులు, అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి పోలీసులకు సహకరించాలని కోరిన పోలీసులు
ఈ తనిఖీల కార్యక్రమంలో మదనపల్లి టూ టౌన్ సీఐ మహమ్మద్ రఫీ, తాలూకా సీఐ కళా వెంకటరమణ, రూరల్ సీఐ రవి నాయక్, వివిధ స్టేషన్ల ఎస్సైలు మదనపల్లి టూ-టౌన్ ఎస్ఐలు, నాగేశ్వరరావు, రామాంజనేయులు,నిమ్మనపల్లి యస్.ఐ. రామకృష్ణ , ముదివేడు యస్. ఐ. మధు రామచంద్రుడు, తాలూకా యస్.ఐ. చంద్రమోహన్, చౌడేపల్లి యస్.ఐ. చిన్న రెడ్డెప్ప, సదుం యస్.ఐ. విష్ణునారాయణ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
Reporter
Namitha News