నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 03 ః తంబళ్లపల్లె మండలం ఆర్ఎన్ తాండ పంచాయతీ ఎద్దుల వారి కోట లో రైతు ఎద్దుల నరసింహులు కు చెందిన వేరుశెనగ పంట నీరు లేక ఎండిపోయేది. కూటమి నాయకులు టిడిపి మండల అధ్యక్షుడురెడ్డప్ప రెడ్డి, మాజీ జడ్పిటిసి రామచంద్ర, గ్రామ కమిటీ అధ్యక్షుడు నరసింహులు, క్లస్టర్ ఇంచార్జ్ కాలా నారాయణ, వెంకటరమణ, తెలుగు యువత నరసింహులు, సుధాకర్ లు సాగునీటి సమస్య పరిష్కారానికి రైతులతో మాట్లాడి ఒప్పించి నరసింహులు కు చెందిన వేరుశెనగ పంటకు సాగునీరు అందించేందుకు సహకరించారు.తన వేరుశెనగ పంట ఎండిపోకుండా సమస్య ను పరిష్కారం చేసిన కూటమి నాయకులకు రైతు నరసింహులు కృతజ్ఞతలు తెలిపారు.
Reporter
Namitha News