నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రైతులకు ప్రభుత్వమే పంటల బీమా చెల్లించాలి -- నిర్వీర్యం అవుతున్న ఆరోగ్య శ్రీ -- పిపిపి విధాన రద్దు చేసి ప్రభుత్వమే మెడికల్ కళాశాలలు నిర్వహించాలి -- మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిసార్ అహమ్మద్ డిమాండ్ మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి చూపిన బాటలో రైతులకు గత వైసిపి ప్రభుత్వమే పంటల బీమా చెల్లించిన విధంగా నేటి కూటమి ప్రభుత్వం కూడా చెల్లించి వుంటే లక్షలాది మంది రైతాంగానికి న్యాయం జరిగి వుండేదని మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిసార్ అహమ్మద్ పేర్కొన్నారు. మంగళవారం మదనపల్లె నియోజకవర్గం నిమ్మనపల్లె మండలం నిమ్మనపల్లె, ముష్ఠురు, తవలం, వెంగంవారిపల్లి, అగ్రహారం, సామకోటవారిపల్లి గ్రామ పంచాయతీలలో కోటి సంతకాల రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నియోజకవర్గ పరిశీలకులు అనూషా రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా నిసార్ అహమ్మద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ అనాలోచితంగా ఆలోచించి రైతాంగానికి తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద కక్షతో రైతాంగానికి ఎంతో ఉపయుక్తంగా ఉండే ఉచిత పంట బీమా రద్దు చేసిందన్నారు. ప్రభుత్వమే రైతుల పక్షాన పంటల బీమా చెల్లించే పధకం కూటమి ప్రభుత్వం కొనసాగించి వుంటే నేడు పంట నష్టపోయిన రైతులకు న్యాయం జరిగి వుండేదని వివరించారు. ఇప్పటికైనా ప్రభుత్వ రైతాంగానికి పంటల బీమా చెల్లింపుపై చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకువచ్చిన ఆరోగ్య శ్రీ పధకం నేడు నిర్వీర్యం అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నెట్ వర్క్ ఆసుపత్రులకు గ్రాంట్ చెల్లింపు సక్రమంగా లేక చాలా ఆసుపత్రులు ఆరోగ్య శ్రీ నిరాకరించి పేదలకు వైద్య అందించడం లేదన్నారు. వైద్య కళాశాలు పిపిపి విధానంలో కాకుండా ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. పేదలకు వైద్యం అందించే మదనపల్లె జిల్లా ఆసుపత్రిలో ఆధునిక యంత్ర పరికరాలు గుంటూరుకు తరలింపు సమంజసం కాదని అన్నారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు అనూషా రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, వి.ఎస్. రెడ్డి, రెడ్డిశేఖర్ రెడ్డి, ఆర్.ఐ. రమణారెడ్డి, శశిధర్ రెడ్డి, నవాజ్, వేణుగోపాల్ రెడ్డి, జయప్రకాష్ రెడ్డి, చండ్రాయుడు, దామోధర్, ప్రవీణ్ కుమార్ రెడ్డి, రఫీ, నూర్ మొహిద్దీన్ ఖాన్, ఖాదర్ బాషా, హేమంత్, నాగరాజ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News