Tuesday, 14 April 2026 07:31:36 AM
# అందరికీ ఆహార భద్రత - అందుబాటు లోకి రానున్న మరో 62 గ్రామీణ అన్న క్యాంటీన్లు # మంగళగిరి జాతీయ రహదారిపై బి.సి.వై కార్యకర్తల ఆందోళన, టెన్షన్ వాతావరణం # దేశవ్యాప్తంగా 14వ తేదీ అర్ధరాత్రి నుండీ పెట్రోల్ ధరలు పెంపు...! # చట్టపరిదిలో బాధితులకు సత్వర న్యాయం చేయాలి - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # వెబ్‌ల్యాండ్ సమస్యలకు చెక్… రైతులకు ఊరట # పి జి ఆర్ ఎస్ అర్జీలకు సకాలంలో నాణ్యతతో పరిష్కారం చూపాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # మదనపల్లె డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన బి. పావని # తంబళ్లపల్లె తాగునీటి సమస్యలు పరిష్కరించండి సార్ - ఆర్డబ్ల్యూఎస్ డి.ఈ కి టిడిపి నేతలు ఫిర్యాదు # కురబ కులాన్ని సౌత్ ఇండియాలో బలోపేతానికి కృషి చేస్తాం - తంబళ్లపల్లె కురుబ సంఘ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసులు # ముద్దలదొడ్డి చెరువులకు హంద్రీనీవా జలాల కోసం సర్వే # అమరావతికి అండగా నిలిచిన కేంద్రానికి కృతజ్ఞతలు # నేడు తంబళ్లపల్లెలో విద్యుత్ అంతరాయం # మిట్స్ లో ఘనంగా అశ్వ్ 2K26- జాతీయ స్థాయీ టెక్నో కల్చరల్ స్పోర్ట్స్ ఫెస్ట్ విజయోత్సవం # వేసవి శెలవు లలో పిల్లల పట్ల జాగ్రత్త వహించండి - ఎస్.ఐ. జిలాని # మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావడం హర్షణీయం - ఈ బిల్లు మహిళా సాధికారతకు భరోసా # ఎస్సీ కాలనీ భూమిని కాపాడాలని విన్నపం # కోర్టు దిక్కరణ కారణం గా మదనపల్లె ఆర్ఓ కు పల్లవి కి బైలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ # మల్లికార్జున స్వామి అన్నదాన కమిటీ చైర్మన్ గా వి. ప్రభాకర్ రెడ్డి # రౌడీ షీటర్లు సమాజంలో సన్మార్గంలో నడవాలి - యస్.ఐ. అనిల్ కుమార్ # టిడిపి నాయకులు ఐకమత్యం తో పార్టీకి అండగా నిలవాలి - కట్టా దొరస్వామినాయుడు

బీసీ ల అభ్యున్నతి కి బోడె రామచంద్ర యాదవ్ బీసీ ధర్మ దీక్ష పేరుతో ఆమరణ నిరాహారదీక్ష

బీసీ సింహగర్జన డిమాండ్ల సాధన కోసం ఏప్రిల్ 11నుండీ బిసివై అధినేత బోడె రామచంద్ర యాదవ్ ఆమరణ నిరాహార దీక్ష

Date : 02 April 2026 07:09 PM Views : 122

నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : అమరావతి - ఏప్రిల్ 02 : బీసీల న్యాయమైన హక్కుల సాధనకై భారత చైతన్య యువజన (బీసీవై) పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్, ముందుగా ప్రకటించిన విధంగా ఏప్రిల్ 11వ తేదీ నుండి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. "బీసీ సింహగర్జన" సభలో ప్రభుత్వం ముందు ఉంచిన ఐదు కీలక డిమాండ్లపై ఇచ్చిన గడువు ముగిసినా ప్రభుత్వం నుండి ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడంతో, ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. మంగళగిరిలోని బీసీవై పార్టీ కేంద్ర కార్యాలయం "పూలే-మండల్ భవన్" వేదికగా "బీసీ ధర్మ దీక్ష" పేరుతో ఈ ఆమరణ నిరాహార దీక్ష జరగనుంది. దశాబ్దాలుగా బీసీలు ఎదుర్కొంటున్న చారిత్రక అన్యాయానికి వ్యతిరేకంగా, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు రామచంద్ర యాదవ్ ఈ కఠోర దీక్షకు పూనుకున్నారని పార్టీ పేర్కొంది. *ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాల్సిన ఐదు కీలక డిమాండ్లు* *1.బీసీ రక్షణ చట్టం:* బీసీల సామాజిక భద్రత కోసం ప్రత్యేకంగా "బీసీ రక్షణ చట్టాన్ని" వెంటనే అమలు చేయాలి *2.అమరావతిలో భూమి:* రాజధాని అమరావతిలో బీసీల ఆత్మగౌరవ భవనాలు, ఇతర అవసరాల కోసం వెయ్యి ఎకరాలు కేటాయించాలి *3.సమగ్ర కులగణన:* రాష్ట్రంలో శాస్త్రీయ ప్రాతిపదికన సమగ్ర కులగణన చేపట్టి, బీసీల కచ్చితమైన జనాభా లెక్కలను తేల్చాలి *44% రిజర్వేషన్లు:* విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు వారి జనాభా దామాషా ప్రకారం 44 శాతం రిజర్వేషన్లు కల్పించాలి *5.బీసీ కార్పొరేషన్లకు నిధులు:* నిర్వీర్యం చేయబడిన బీసీ కార్పొరేషన్లకు తక్షణమే నిధులు విడుదల చేసి, బీసీ యువతకు స్వయం ఉపాధి కల్పించాలి ప్రభుత్వం బీసీల సహనాన్ని పరీక్షించవద్దని, వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని బీసీవై పార్టీ హితవు పలికింది. ఈ ధర్మ దీక్షకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ సోదరులు, ప్రజాస్వామ్యవాదులు, మేధావులు సంఘీభావం తెలిపి, విజయవంతం చేయాలని పార్టీ పిలుపునిచ్చింది.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :