నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - నవంబర్ 22 : సీపీఐ జాతీయ కార్యదర్శిగా ఎన్నికైన అనంతపురం మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ కె. రామకృష్ణ మదనపల్లికి వచ్చిన సందర్భంగా పార్టీ నాయకులు ఘనంగా శాలువాతో సత్కరించారు. విద్యార్థి దశ నుంచి పేదలు, రైతులు, కార్మికుల కోసం రాజీలేని పోరాటాలు చేసిన ఆయనకు విప్లవ ధన్యవాదాలు తెలిపారు సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను ఖండిస్తూ, ఉద్యమకారులపై చేస్తున్న అణిచివేతపై చర్యలు తీసుకోవాలని స్థానిక నాయకులు రామకృష్ణకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ సాంబశివ , సిపిఐ నాయకులు కృషప్ప, AISF నాయకులు పాల్గొన్నారు.
Reporter
Namitha News