నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె -మే 09 : అంగళ్ళు సమీపం లోని మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీకు చెందిన విద్యార్థులు కడపలోని కేఎస్ఆర్ఎమ్ ఇంజినీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన “కేఎస్ఆర్ఎమ్ అంతర్ ఇంజినీరింగ్ కళాశాల క్రీడా పోటీలు – 2026” లలో విశేష ప్రతిభ చూపారని ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్ తెలిపారు. వివిధ కళాశాలల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీలలో మిట్స్ యూనివర్సిటీ మహిళా జట్లు వాలీబాల్ మరియు టెన్నికాయిట్ విభాగాలలో ద్వితీయ స్థానాలను సాధించారని తెలిపారు . వాలీబాల్ విభాగంలో రూ.5,000 నగదు బహుమతి, టెన్నికాయిట్ విభాగంలో రూ.1,500 నగదు బహుమతిని గెలుచుకున్నారు. ఈ విజయంతో విద్యార్థినుల కృషి, క్రమశిక్షణ, జట్టు భావన మరియు క్రీడాస్ఫూర్తి ప్రతిఫలించిందని అన్నారు . ఈ పోటీలలో ఈసీఈ, డేటా సైన్స్, ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ విభాగాలకు చెందిన విద్యార్థినులు విశేష ప్రతిభ కనబరిచారు. క్రీడా రంగంలో విద్యార్థులను నిరంతరం ప్రోత్సహిస్తూ సహకారం అందిస్తున్న మిట్స్ యూనివర్సిటీ యాజమాన్యానికి ఫీజికల్ డైరెక్టర్ డాక్టర్ సి. దామోదరన్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, ఫీజికల్ డైరెక్టర్ డాక్టర్ సి. దామోదరన్ విభాగాధిపతులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Reporter
Namitha News