నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 12 ః తంబళ్లపల్లె మండలం లోని రౌడీ షీటర్లు సమాజంలో సన్మార్గంలో నడవాలిని ఎస్సై టి అనిల్ కుమార్ హితబోధ చేశారు. ఆదివారం ఆయన పోలీస్ స్టేషన్ ఆవరణంలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. రౌడీ షీటర్లు ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలలో పాలు పంచుకోరాదని అలా కానీ ఎడల చట్టపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు. రౌడీ షీటర్లు పోలీసులకు అందుబాటులో ఉండి సత్ప్రవర్తన కలిగి ఉండాలని సూచించారు. ఈ కౌన్సిలింగ్లో ఏఎస్ఐ నజీర్ భాష, సిబ్బంది పాల్గొన్నారు.
Reporter
Namitha News