నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 19 : తంబళ్లపల్లె నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచిన టిడిపి నాయకులు, కార్యకర్తల సహకారంతో పూర్వ వైభవం తీసుకువస్తానని రాజంపేట పార్లమెంట్ టిడిపి అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు హామీ ఇచ్చారు. శుక్రవారం తంబళ్లపల్లె మండల నాయకులు టిడిపి పార్లమెంట్ అధ్యక్షుడిగా ఎన్నికైన ప్రసాద్ బాబును దృశ్యాలవులు, పూలమాలలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. తంబళ్లపల్లె లో తెలుగుదేశం పార్టీ దుస్థితిపై ఆయనకు కూలంకషంగా వివరించారు. తెలుగుదేశం పార్టీ కోసం నాయకులు, కార్యకర్తలు గత ఐదేళ్ల వైకాపా అరాచక పాలనలో ఇసుక, మైనింగ్, భూ దోపిడి పై నిలదీస్తే మాపై దౌర్జన్యాలు, అక్రమకేసులు బనాయించినా ఎదురొడ్డి నిలిచి అన్ని రకాలుగా కార్యకర్తలు నష్టపోయినట్టు చెప్పారు. నేడు పార్టీ అధికారం వచ్చినా మా పనులు జరగలేదని తమ ఆవేదన వ్యక్తం చేశారు. నేడు తంబళ్లపల్లె లో పార్టీని నడిపించే నాయకుడు లేక అనాధగా మిగిలిపోయామని వాపోయారు. దీనిపై స్పందించిన ప్రసాద్ బాబు ఎవరూ అధైర్య పడాల్సిన పనిలేదని పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు పార్టీలో న్యాయం జరుగుతుందని తంబళ్లపల్లెకు దీటైన నాయకత్వం వస్తుందని మీకు ఏ సమస్య వచ్చినా పార్టీ అండగా ఉంటుందని 24 గంటలు మీకు అందుబాటులో ఉంటానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం లో జరిగిన అభివృద్ధిని నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంతో ప్రతి గడపకు చేర్చాలని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపాను తరిమి కొట్టాలని సూచించారు. ఆయన వెంట టిడిపి నాయకులు తెలుగుదేశం యువ నాయకుడు పురుషోత్తం , తెలుగుదేశం సీనియర్ తెలుగుదేశం నాయకుడు వెంకటరమణ ,యువగళం మనిగే బాలాజీ నాయుడు, బీసీ నాయకుడు సీనియర్ తెలుగు యువత నియోజకవర్గ ఉపాధ్యక్షుడు నరసింహులు, వీరాంజనేయులు,బాలకృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ శంకర, మైనార్టీ నాయకుడు మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News