Thursday, 16 April 2026 08:28:09 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

తంబళ్లపల్లె లో టిడిపి కి పూర్వ వైభవం తీసుకువస్తా - సుగవాసి ప్రసాద్ బాబు

Date : 19 December 2025 07:58 PM Views : 234

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 19 : తంబళ్లపల్లె నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచిన టిడిపి నాయకులు, కార్యకర్తల సహకారంతో పూర్వ వైభవం తీసుకువస్తానని రాజంపేట పార్లమెంట్ టిడిపి అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు హామీ ఇచ్చారు. శుక్రవారం తంబళ్లపల్లె మండల నాయకులు టిడిపి పార్లమెంట్ అధ్యక్షుడిగా ఎన్నికైన ప్రసాద్ బాబును దృశ్యాలవులు, పూలమాలలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. తంబళ్లపల్లె లో తెలుగుదేశం పార్టీ దుస్థితిపై ఆయనకు కూలంకషంగా వివరించారు. తెలుగుదేశం పార్టీ కోసం నాయకులు, కార్యకర్తలు గత ఐదేళ్ల వైకాపా అరాచక పాలనలో ఇసుక, మైనింగ్, భూ దోపిడి పై నిలదీస్తే మాపై దౌర్జన్యాలు, అక్రమకేసులు బనాయించినా ఎదురొడ్డి నిలిచి అన్ని రకాలుగా కార్యకర్తలు నష్టపోయినట్టు చెప్పారు. నేడు పార్టీ అధికారం వచ్చినా మా పనులు జరగలేదని తమ ఆవేదన వ్యక్తం చేశారు. నేడు తంబళ్లపల్లె లో పార్టీని నడిపించే నాయకుడు లేక అనాధగా మిగిలిపోయామని వాపోయారు. దీనిపై స్పందించిన ప్రసాద్ బాబు ఎవరూ అధైర్య పడాల్సిన పనిలేదని పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు పార్టీలో న్యాయం జరుగుతుందని తంబళ్లపల్లెకు దీటైన నాయకత్వం వస్తుందని మీకు ఏ సమస్య వచ్చినా పార్టీ అండగా ఉంటుందని 24 గంటలు మీకు అందుబాటులో ఉంటానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం లో జరిగిన అభివృద్ధిని నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంతో ప్రతి గడపకు చేర్చాలని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపాను తరిమి కొట్టాలని సూచించారు. ఆయన వెంట టిడిపి నాయకులు తెలుగుదేశం యువ నాయకుడు పురుషోత్తం , తెలుగుదేశం సీనియర్ తెలుగుదేశం నాయకుడు వెంకటరమణ ,యువగళం మనిగే బాలాజీ నాయుడు, బీసీ నాయకుడు సీనియర్ తెలుగు యువత నియోజకవర్గ ఉపాధ్యక్షుడు నరసింహులు, వీరాంజనేయులు,బాలకృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ శంకర, మైనార్టీ నాయకుడు మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :