Thursday, 30 July 2026 06:49:35 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

తంబళ్లపల్లె లో టిడిపి కి పూర్వ వైభవం తీసుకువస్తా - సుగవాసి ప్రసాద్ బాబు

Date : 19 December 2025 07:58 PM Views : 343

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 19 : తంబళ్లపల్లె నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచిన టిడిపి నాయకులు, కార్యకర్తల సహకారంతో పూర్వ వైభవం తీసుకువస్తానని రాజంపేట పార్లమెంట్ టిడిపి అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు హామీ ఇచ్చారు. శుక్రవారం తంబళ్లపల్లె మండల నాయకులు టిడిపి పార్లమెంట్ అధ్యక్షుడిగా ఎన్నికైన ప్రసాద్ బాబును దృశ్యాలవులు, పూలమాలలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. తంబళ్లపల్లె లో తెలుగుదేశం పార్టీ దుస్థితిపై ఆయనకు కూలంకషంగా వివరించారు. తెలుగుదేశం పార్టీ కోసం నాయకులు, కార్యకర్తలు గత ఐదేళ్ల వైకాపా అరాచక పాలనలో ఇసుక, మైనింగ్, భూ దోపిడి పై నిలదీస్తే మాపై దౌర్జన్యాలు, అక్రమకేసులు బనాయించినా ఎదురొడ్డి నిలిచి అన్ని రకాలుగా కార్యకర్తలు నష్టపోయినట్టు చెప్పారు. నేడు పార్టీ అధికారం వచ్చినా మా పనులు జరగలేదని తమ ఆవేదన వ్యక్తం చేశారు. నేడు తంబళ్లపల్లె లో పార్టీని నడిపించే నాయకుడు లేక అనాధగా మిగిలిపోయామని వాపోయారు. దీనిపై స్పందించిన ప్రసాద్ బాబు ఎవరూ అధైర్య పడాల్సిన పనిలేదని పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు పార్టీలో న్యాయం జరుగుతుందని తంబళ్లపల్లెకు దీటైన నాయకత్వం వస్తుందని మీకు ఏ సమస్య వచ్చినా పార్టీ అండగా ఉంటుందని 24 గంటలు మీకు అందుబాటులో ఉంటానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం లో జరిగిన అభివృద్ధిని నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంతో ప్రతి గడపకు చేర్చాలని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపాను తరిమి కొట్టాలని సూచించారు. ఆయన వెంట టిడిపి నాయకులు తెలుగుదేశం యువ నాయకుడు పురుషోత్తం , తెలుగుదేశం సీనియర్ తెలుగుదేశం నాయకుడు వెంకటరమణ ,యువగళం మనిగే బాలాజీ నాయుడు, బీసీ నాయకుడు సీనియర్ తెలుగు యువత నియోజకవర్గ ఉపాధ్యక్షుడు నరసింహులు, వీరాంజనేయులు,బాలకృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ శంకర, మైనార్టీ నాయకుడు మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :