నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబల్లపల్లి - జులై 03 : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియ ను విజయవంతముగా పూర్తి చేయడానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు సహాయ సహకారాలు అందించాలని ఈఆర్ఓ మాధవ కృష్ణా రెడ్డి కోరారు,శుక్రవారం తంబల్లపల్లి రెవెన్యూ కార్యాలయంలో తహశీల్దార్ శ్రీనివాసులుతో కలిసి అధికారులు, బియల్ఏలు,రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు, వారు పలు సందేశాలను వెల్లడించారు,బియల్ఓ లకు సహకరించి ఖచ్చితమైన ఓటర్ల జాబితా తయారీకి అన్ని రాజకీయ నాయకుల తోడ్పాటు అందించి సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షుడు రెడ్డి, తెలుగుదేశం యువ నాయకుడు పురుషోత్తం, ఎక్స్ జెడ్పిటిసి రామచంద్ర, వైఎస్ఆర్సిపి మాజీ సర్పంచ్ శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News