నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - సెప్టెంబర్ 05 : రాయచోటి లో ముగ్గురు రాష్ట్ర మంత్రులను శనివారం తంబళ్లపల్లె మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జి.శంకర్ యాదవ్ జిల్లా ఇన్చార్జి మంత్రి బిసి జనార్దన్ రెడ్డి, క్రీడా శాఖ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, జోన్-4 కోఆర్డినేటర్ దామచర్ల సత్య లను దుశ్యాలువలు, పూల బుకేలతో ఘనంగా సన్మానించారు. వారు తంబళ్లపల్లె నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ కి పూర్వ వైభవం తీసుకురావాలని ఆకాంక్షించారు. పూర్తిగా వెనుకబడిన తంబళ్లపల్లె అభివృద్ధిలో రాష్ట్ర మంత్రులు తమ పూర్తి సహకారం అందివ్వాలని జి.శంకర్ యాదవ్ కోరగా వారు సానుకూలంగా స్పందించారు
Reporter
Namitha News