Sunday, 13 September 2026 11:21:20 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

అట్టహాసంగా శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభం

- ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించడమే లక్ష్యం - ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ శ్రీహరి,డాక్టర్ భారతిలు స్పష్టం

Date : 27 February 2026 02:46 PM Views : 241

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అట్టహాసంగా శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభం - ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించడమే లక్ష్యం - ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ శ్రీహరి,డాక్టర్ భారతిలు స్పష్టం - హాజరైన వివిధ పార్టీల నాయకులు,పుర ప్రముఖులు గ్రామీణ,పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యమని శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్వాహకులు,ప్రముఖ వైద్యులు డాక్టర్ శ్రీహరి (ఎం.ఎస్),డాక్టర్ భారతిలు పేర్కొన్నారు.శుక్రవారం అన్నమయ్య కేంద్రమైన మదనపల్లి పట్టణం,సొసైటీ కాలనీ,రెండవ మెయిన్ నందు అధునాతన హంగులతో నిర్మితమైన నూతన భవనంలో ఆసుపత్రిని అట్టహాసంగా ప్రారంభించారు.ఈ ప్రారంభోత్సవానికి వివిధ పార్టీల నాయకులు,పుర ప్రముఖులు పెద్దఎత్తున హాజరయ్యారు.ఈ సందర్భంగా డాక్టర్ శ్రీహరి మాట్లాడుతూ తాను గతంలో బెంగళూరు మణిపాల్ ఆసుపత్రి నందు జనరల్ సర్జనుగా పనిచేశానన్నారు.అనంతరం మదనపల్లి పట్టణంలో కదిరి రోడ్డు,రాఘవేంద్ర బుక్ స్టాల్ పక్కన ఉన్న భవనం నందు శ్రీ సాయి హాస్పిటల్ సేవలు ప్రారంభించడం జరిగిందన్నారు.మా ఆసుపత్రి నందు అన్నిరకాల జబ్బులకు మెరుగైన వైద్యం అందించడం జరుగుతుందన్నారు.ముఖ్యంగా ల్యాప్రోస్కోఫిక్ శస్త్రచికిత్సలు,క్యాన్సర్ వ్యాధికి సంబంధించిన శస్త్రచికిత్స,అధునాతన సాంకేతిక విధానంతో నిర్వహించడం మా ప్రత్యేకత అన్నారు.అదేవిధంగా షుగర్ సంబంధిత జబ్బులకు ప్రత్యేక వైద్యం అందించబడుతుందన్నారు.దంతవైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు.24×7 ప్రజలకు వైద్యసేవలు అందుతాయన్నారు.నూతన భవనంలో వైద్యసేవలు ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందని,తక్కువ ఫీజులతో ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించడమే తమ సంకల్పమన్నారు.మా ఆహ్వానం మేరకు ఆసుపత్రి ప్రారంభోత్సవానికి విచ్చేసిన అతిథులు,రాజకీయ ప్రముఖులు,ప్రజలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.అనంతరం అందరికీ విందు భోజనం వడ్డించారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :