నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూన్ 02 : మదనపల్లె సమీపంలోని మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ వ్యవస్థాపకులు మరియు ఛాన్సలర్ డాక్టర్ నాదెళ్ల విజయభాస్కర్ చౌదరి గారి సతీమణి, ఆర్.ఆర్.ఆర్. ఎడ్యుకేషనల్ అకాడమీ ట్రెజరర్ శ్రీమతి నాదెళ్ల లక్ష్మీ రాజ్యం గారి అకాల మరణం పట్ల విశ్వవిద్యాలయ అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు మరియు కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతి, ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసినట్లు మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి. యువరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాదెళ్ల లక్ష్మీ రాజ్యం గారు విద్యా, సేవా కార్యక్రమాల పట్ల ఎల్లప్పుడూ ప్రత్యేక ఆసక్తి కనబరుస్తూ, మానవతా విలువలను ఆచరిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. ఆమె మరణం యూనివర్సిటీ కుటుంబానికి తీరని లోటని అన్నారు. ప్రజల సందర్శనార్థం శ్రీమతి నాదెళ్ల లక్ష్మీ రాజ్యం గారి పార్థివ దేహాన్ని బుధవారం ఉదయం 10.00 గంటల నుండి మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ ప్రాంగణంలోని నాదెళ్ల పెద్దప్ప నాయుడు బ్లాక్లో ఉంచనున్నట్లు తెలిపారు. బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు మరియు అభిమానులు ఆమెకు తమ అంతిమ నివాళులు అర్పించాలని కోరారు. అలాగే, శ్రీమతి నాదెళ్ల లక్ష్మీ రాజ్యం గారి అకాల మరణం నేపథ్యంలో బుధవారం (03-06-2026) యూనివర్సిటీకి సెలవు దినంగా ప్రకటించినట్లు వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి. యువరాజ్ తెలిపారు
Reporter
Namitha News