Thursday, 30 July 2026 02:33:29 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

నాదెళ్ల లక్ష్మీ రాజ్యం గారి అకాల మరణం పట్ల మిట్స్ యూనివర్సిటీ లో ఘన నివాళులు

యూనివర్సిటీ లో ఉపాధ్యాయ, నాన్ టీచింగ్ సిబ్బంది, విద్యార్థులు ప్రగాఢ సంతాపం

Date : 02 June 2026 05:00 PM Views : 159

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూన్ 02 : మదనపల్లె సమీపంలోని మదనపల్లె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ వ్యవస్థాపకులు మరియు ఛాన్సలర్ డాక్టర్ నాదెళ్ల విజయభాస్కర్ చౌదరి గారి సతీమణి, ఆర్.ఆర్.ఆర్. ఎడ్యుకేషనల్ అకాడమీ ట్రెజరర్ శ్రీమతి నాదెళ్ల లక్ష్మీ రాజ్యం గారి అకాల మరణం పట్ల విశ్వవిద్యాలయ అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు మరియు కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతి, ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసినట్లు మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి. యువరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాదెళ్ల లక్ష్మీ రాజ్యం గారు విద్యా, సేవా కార్యక్రమాల పట్ల ఎల్లప్పుడూ ప్రత్యేక ఆసక్తి కనబరుస్తూ, మానవతా విలువలను ఆచరిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. ఆమె మరణం యూనివర్సిటీ కుటుంబానికి తీరని లోటని అన్నారు. ప్రజల సందర్శనార్థం శ్రీమతి నాదెళ్ల లక్ష్మీ రాజ్యం గారి పార్థివ దేహాన్ని బుధవారం ఉదయం 10.00 గంటల నుండి మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ ప్రాంగణంలోని నాదెళ్ల పెద్దప్ప నాయుడు బ్లాక్‌లో ఉంచనున్నట్లు తెలిపారు. బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు మరియు అభిమానులు ఆమెకు తమ అంతిమ నివాళులు అర్పించాలని కోరారు. అలాగే, శ్రీమతి నాదెళ్ల లక్ష్మీ రాజ్యం గారి అకాల మరణం నేపథ్యంలో బుధవారం (03-06-2026) యూనివర్సిటీకి సెలవు దినంగా ప్రకటించినట్లు వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి. యువరాజ్ తెలిపారు

admin

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: