Thursday, 16 April 2026 03:20:10 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

అట్టహాసంగా టిడిపి రాజంపేట పార్లమెంట్ కార్యవర్గం పదవీప్రమాణ స్వీకారం

అధ్యక్షుడిగా సుగవాసి ప్రసాద్ బాబు

Date : 02 March 2026 09:10 PM Views : 160

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 02 : రాజంపేట పార్లమెంట్ తెలుగుదేశంపార్టీ నూతన కార్యవర్గం కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం మదనపల్లి పట్టణం లోని రామ తులసి కన్వెన్షన్ నందు సోమవారం అత్యంత అట్టహాసంగా నిర్వహించారు. రాజంపేట పార్లమెంట్ నూతన అధ్యక్షుడిగా సుగవాసి ప్రసాద్ బాబు గారితో పాటు నూతన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఏడు నియోజకవర్గాల నుండీ కార్యకర్తలు, అభిమానులు తరలి రావడం తో పట్టణం పసుపు సైనికులతో నిండిపోయింది. కార్యవర్గం ప్రమాణం స్వీకారం కార్యక్రమం కు ​ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్చార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, స్థానిక రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యేలు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, షాజహాన్ బాషా, రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి, టిడిపి ఇన్చార్జిలు రూపానంద రెడ్డి, జగన్మోహన్ రాజు, చల్లా బాబు, కార్పొరేషన్ ఛైర్మెన్లు, డైరెక్టర్లు, రాష్ట్ర స్థాయి నాయకులు, టిడిపి సీనియర్ మహిళలు, తదితరులు పాల్గొనికార్యకర్తల నిద్దేశించి ప్రసంగించారు. ​ఈ సందర్భంగా సుగవాసి ప్రసాద్ బాబు మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, పల్లా శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలిపారు. "నాయకులకు, కార్యకర్తలకు మధ్య సమన్వయకర్తగా ఉంటూ, ప్రతి కార్యకర్తకు అండగా నిలబడతాను. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ జెండా ఎగురవేస్తాం. ఎమ్మెల్యేలు, ఇన్చార్జిల సమన్వయంతో కలిసి పనిచేస్తామని తెలిపారు, 2029 ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ స్థానాలతో పాటు పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకోవడమే మా లక్ష్యం" అని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసి నన్ను ఆశీర్వదించిన నాయకులకు కార్యకర్తలకు, అభిమానులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :