నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 14 : జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాల ప్రారంభం సందర్భంగా నేడు మదనపల్లి అగ్నిమాపక కేంద్రం నందు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా జిల్లా అగ్నిమాపక అధికారి వి ఆదినారాయణ రెడ్డి ఏర్పాటు చేసిన ప్రదర్శన లో అగ్నిప్రమాదం చోటు చేసుకొన్నప్పుడు వాడే పరికరాలను చూపిస్తూ అతిధులకు, కార్యక్రమం కు హాజరైన విద్యార్థుల కు అవగాహనా కల్పించారు. తదనంతరం అగ్నిమాపక అధికారి శివప్ప మాట్లాడుతూ అగ్ని ప్రమాదాల పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు నివారణ చర్యల గురించి వివరించారు తదనంతరం అగ్ని ప్రమాదాలు నివారణ చర్యల గురించి వివరించే కరపత్రములను మరియు గోడ పత్రికలను ఆవిష్కరణ చేశారు. అగ్నిమాపక సిబ్బంది అగ్ని ప్రమాదాలలో మరియు రెస్క్యూ ఆపరేషన్లలో వాడు వివిధ పరికరముల గురించి ప్రదర్శన ద్వారా క్లుప్తంగా వివరించారు ఈ కార్యక్రమములో యన్.సి.సి. విద్యార్థి, విద్యార్థినిలు , ఉపాధ్యాయులు, అభ్యుదయ స్కూల్ కరస్పాండెంట్ , ప్రిన్సిపాల్ ప్రసాద్ , వాసవి క్లబ్ ప్రెసిడెంట్ కృష్ణా రావు, వాసవి క్లబ్ సభ్యులు, వనిత క్లబ్ సభ్యులు సరళ, ఇతర సభ్యులు, మరియు మదనపల్లి అగ్నిమాపక కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు
Reporter
Namitha News