నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నవంబర్ 14: మదనపల్లె పట్టణం రంగారెడ్డి కాలనీకి చెందిన శశి కుమార్ ఏడేళ్ల కుమార్తె NJR పాఠశాల విద్యార్థిని అంజలీ గ్రేస్ అదృశ్యం అయింది. దీన్ని చాలెంజింగ్ గా తీసుకుని అన్నమయ్యజిల్లా ఎస్పి దీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు మదనపల్లి డిఎస్పి మహేంద్ర సూచనలతో ఒకటవ పట్టణ సీఐ మహ్మద్ రఫి ఆద్వర్యంలో ఎస్సైలు, సిబ్బంది వేరు వేరు బృందాలుగా దర్యప్తు చేపట్టారు. సరిగ్గా రెండు గంటల సమయంలోనే బాలిక ఆచూకిని రాజంపేటలో కనుగొన్నారు. విచారణలో భాగంగా మతి స్థిమితం సరిగా లేని బాలిక పెద్దమ్మే బాలికను తీసుకెళ్లిపోవడం బయట పడింది. రెండు గంటల్లో బాలిక ఆచూకి కనుగొన్న పోలీసు సిబ్బందికి బాలిక తల్లిదండ్రులు, ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.
Reporter
Namitha News