Thursday, 30 July 2026 03:35:42 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మిట్స్ యూనివర్సిటీ లో ఎంబెడెడ్ సిస్టమ్స్ పై స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం

ఐ.యస్.టి.ఈ. సహకారం తో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం

Date : 15 December 2025 09:04 PM Views : 161

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - డిసెంబర్ 15 : అంగళ్ళు సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మరియు స్కిల్ డెవలప్మెంట్ సెల్ విభాగం వారు మిట్స్ ఐ.ఎస్.టీ.ఈ స్టూడెంట్ చాప్టర్ వారి సహకారంతో ఎంబెడెడ్ సిస్టమ్స్ అంశంపై ఆరు రోజుల స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఢిల్లీకి చెందిన ఎంబెడెడ్ సిస్టమ్స్ ట్రైనీ ఇంజనీర్ షరీఫ్ షేక్, ఐలిన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఆధునిక సాంకేతిక ప్రపంచంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ఇవి ప్రత్యేకమైన పనులను అత్యంత వేగంగా, ఖచ్చితంగా మరియు విశ్వసనీయంగా నిర్వహించేందుకు రూపొందించబడిన కంప్యూటింగ్ సిస్టమ్స్ అని అన్నారు. గృహోపకరణాలు వంటి వాషింగ్ మెషిన్‌లు, ఎయిర్ కండీషనర్లు, మైక్రోవేవ్ ఓవెన్లు నుంచి ఆటోమొబైల్ రంగంలో ఉపయోగించే ఇంజిన్ కంట్రోల్ యూనిట్లు, ఎయిర్‌బ్యాగ్ సిస్టమ్స్ వరకు ఎంబెడెడ్ సిస్టమ్స్ విస్తృతంగా వినియోగంలో ఉన్నాయి. పరిశ్రమల్లో ఆటోమేషన్, రోబోటిక్స్, ప్రాసెస్ కంట్రోల్ వంటి రంగాల్లో ఎంబెడెడ్ సిస్టమ్స్ ఉత్పాదకతను పెంచుతూ ఖర్చులను తగ్గిస్తున్నాయి. ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ అల్గారిథంలను నేరుగా పరికరాల్లోనే అమలు చేయడానికి అవసరమైన హార్డ్‌వేర్–సాఫ్ట్‌వేర్ వేదికను ఎంబెడెడ్ సిస్టమ్స్ అందిస్తున్నాయి. సెన్సర్లు, మైక్రోకంట్రోలర్లు, ప్రాసెసర్లు మరియు ఎడ్జ్ కంప్యూటింగ్ సామర్థ్యాల సహాయంతో డేటాను రియల్ టైమ్‌లో సేకరించి, విశ్లేషించి, తక్షణ నిర్ణయాలు తీసుకోవడం సాధ్యమవుతోంది. దీంతో క్లౌడ్‌పై ఆధారపడకుండా వేగవంతమైన మరియు భద్రమైన కృత్రిమ మేధస్సు అప్లికేషన్లు అభివృద్ధి చేయవచ్చు అని అన్నారు. అలాగే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT), స్మార్ట్ సిటీలు, స్మార్ట్ వ్యవసాయం, స్మార్ట్ ఎనర్జీ మేనేజ్‌మెంట్ వంటి ఆధునిక భావనలకు ఎంబెడెడ్ సిస్టమ్స్ పునాదిగా నిలుస్తున్నాయి. ఈ కారణంగా ఎంబెడెడ్ సిస్టమ్స్‌పై నైపుణ్యం కలిగిన ఇంజినీర్లకు పరిశ్రమల్లో విస్తృత ఉద్యోగ అవకాశాలు ఉండటంతో పాటు, భవిష్యత్తు సాంకేతిక అభివృద్ధిలో ఇవి మరింత కీలకంగా మారనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో విభాగాధిపతి ఏ.వి పవన్ కుమార్, స్కిల్ డెవలప్మెంట్ సిల్ కోఆర్డినేటర్ డాక్టర్ వి బి తురై రాజ్, కోకోర్డినేటర్స్ డి కార్తీక్, డాక్టర్ టీ ఎస్ బాలాజీ దామోదర్, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :