నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఆగస్టు 12 : మోడల్ స్కూల్లో అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఎయిడ్స్ సురక్ష,-చైతన్య పోస్టర్లను ప్రిన్సిపాల్ హేమంత్ కుమార్, ఐ సి టి సి కౌన్సిలర్ చంద్రమోహన్, ల్యాబ్ టెక్నీషియన్ బాలాజీలు ఆవిష్కరించారు. బుధవారం మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ మాట్లాడుతూ హెచ్ఐవి, ఎయిడ్స్ పై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని ఇది మన అందరి బాధ్యత అని ప్రిన్సిపాల్ హేమంత్ కుమార్ విద్యార్థులకు ప్రబోధించారు. ఏపీ సాక్స్ ఆదేశాల మేరకు దిశా సూచనల మేరకు ఐసిటిసి, కృషి ఎన్జీవో సమస్త ఆధ్వర్యంలో హెచ్ఐవి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చంద్రమోహన్ మాట్లాడుతూ యువత హెచ్ఐవి పై అవగాహన కలిగి ఉండాలన్నారు. అవగాహన కార్యక్రమాలు రెండు నెలలపాటు నిర్వహిస్తామని ప్రభుత్వాసుపత్రులలో ఉచితంగా హెచ్ఐవి పరీక్షలు చేస్తామన్నారు. హెచ్ఐవి ఎలా వస్తుంది రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరీక్ష ఎందుకు నిర్వహించాలి అనే అంశంపై వివరించారు. హెచ్ఐవి రిస్క్ అసెస్మెంట్ క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేయించారు. ఈ కార్యక్రమంలో కృషి ఎన్జీవో వివో శ్రీనివాసులు, ఓ ఆర్ డబ్ల్యు సావిత్రి, పల్లవి విద్యార్థులు పాల్గొన్నారు
Reporter
Namitha News