Sunday, 13 September 2026 04:35:28 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

మై భారత్ పోర్టల్‌లో జిల్లా యువత నమోదు విస్తృతంగా చేపట్టాలి - అవకాశాల కల్పనలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి - జిల్లా ఇంఛార్జి కలెక్టర్ శివ నారాయణ శర్

Date : 03 August 2026 05:58 PM Views : 123

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మై భారత్ పోర్టల్‌లో జిల్లా యువత నమోదు విస్తృతంగా చేపట్టాలి - అవకాశాల కల్పనలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి - జిల్లా ఇంఛార్జి కలెక్టర్ శివ నారాయణ శర్మ పిలుపు అన్నమయ్య జిల్లాలో అర్హులైన యువతను పెద్దఎత్తున మై భారత్ పోర్టల్‌లో నమోదు చేయించేలా అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ శివ నారాయణ శర్మ అధికారులను ఆదేశించారు.సోమవారం మదనపల్లి కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్లో మై భారత్ కేంద్రం - యువ అంశంపై జిల్లా సలహా మండలి సమావేశం ఇన్చార్జి కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు మై భారత్ పోర్టల్ ఒక ముఖ్యమైన వేదికగా పనిచేస్తోందన్నారు.జిల్లాలోని యువతకు ఈ పోర్టల్ ద్వారా ప్రభుత్వ పథకాలు,స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు,నైపుణ్యాభివృద్ధి,నాయకత్వ వికాసం,జాతీయ స్థాయి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.జిల్లాలో నిర్వహిస్తున్న మై భారత్ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు విద్య,యువజన,నైపుణ్యాభివృద్ధి,గ్రామీణాభివృద్ధి తదితర శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి అర్హులైన ప్రతి యువకుడిని,యువతిని పోర్టల్‌లో నమోదు చేయించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.అనంతరం జిల్లా యువజన అధికారి దీపక్ జేమ్స్ మాట్లాడుతూ మై భారత్ పోర్టల్ ద్వారా యువతకు స్వచ్ఛంద సేవా అవకాశాలు,నైపుణ్యాభివృద్ధి శిక్షణలు,నాయకత్వ వికాస కార్యక్రమాలు,ఉపాధి మరియు జాతీయ స్థాయి యువజన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు లభిస్తాయని వివరించారు.ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి,డీఆర్‌ఓ వెంకటేష్,కెఆర్‌సీసీ ఎస్‌డీసీ చంద్రశేఖర్ రెడ్డి,జిల్లా సలహా మండలి సభ్యులు,వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: