నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 04 : తంబళ్లపల్లె కు చెందిన ప్రజలు ముందస్తు ఇంటి పన్ను చెల్లించి ఐదు శాతం రాయితీ పొందాలని డివిజనల్ పంచాయతీ ఆఫీసర్ నాగరాజు పిలుపునిచ్చారు. సోమవారం ఆయన తంబళ్లపల్లె ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించి మండలంలో ఇంటి పన్ను వసూలు, బకాయిలు, గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పన పై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2026-27 ఆర్తి చేయడానికి ఇంటి పన్ను ఈనెల 31వ తేదీ లోపు ముందస్తుగా చెల్లించి ఐదు శాతం రాయితీ పొందాలని సూచించారు. ఇప్పటివరకు ముందస్తు పన్ను చెల్లింపు మదనపల్లెలో 37 వేలు, నిమ్మనపల్లి 13వేలు, చౌడేపల్లి 15వేలు, కురబల కోట 12వేలు, పుంగనూరు ఐదువేలు, పీటీఎం 3000, పెద్దమండెంలో 1000 రూపాయలు మొత్తం 86000 వసూలు అయినట్లు చెప్పారు. గత ఏడాది పన్ను వసూళ్లు డివిజన్ స్థాయిలో రూ5.92 కోట్లు డిమాండ్ ఉండగా రూ 5.49 కోట్లు వసూలు జరిగి రూ 43 లక్షలు బకాయిలు ఉన్నట్లు మొత్తం 92.73% పన్ను వసూల్ అయినట్లు చెప్పారు. పంచాయతీలు ఆదాయ వనరు పెంపుకు మైనర్ ఇరిగేషన్ చెరువులు చేపలు చెరువు వేలం, వారపు సంతలు, బస్టాండ్ గేట్లు, మినీ పరిశ్రమలు, ప్రైవేట్ వ్యాపార సముదాయాల లైసెన్స్ ఫీజులు వసూళ్లపై దృష్టి సారించాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీవో ఎంవీ ప్రసాద్, కార్యదర్శిలు శ్రీనివాసరావు, హరి ప్రసాద్, పద్మావతి, భాస్కర్ సిబ్బంది పాల్గొన్నారు
Reporter
Namitha News