Wednesday, 29 July 2026 11:05:51 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

మిట్స్ లో అల్యూమిని మీట్

Date : 31 January 2026 08:24 PM Views : 149

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 31 : సమీపం లోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం వారు మిట్స్ అల్యూమిని రిలేషన్స్ వారి ఆధ్వర్యంలో అల్యూమిని మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యూనివర్సిటీ నందు చదువుకున్న పూర్వ విద్యార్థులు హాజరైనారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్ మాట్లాడుతూ యూనివర్సిటీ అభివృద్ధిలో మరియు ప్రస్తుత విద్యార్థుల భవిష్యత్ రూపకల్పనలో అల్యూమిని విద్యార్థుల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. పరిశ్రమల్లో స్థిరపడిన అల్యూమిని విద్యార్థులు తమ అనుభవాలు, నైపుణ్యాలు, కెరీర్ మార్గదర్శకత్వాన్ని ప్రస్తుత విద్యార్థులతో పంచుకోవడం ద్వారా వారికి సరైన దిశానిర్దేశం లభిస్తుందని అన్నారు. అలాగే ఇంటర్న్‌షిప్స్, ప్లేస్‌మెంట్స్, స్టార్టప్ అవకాశాలు, పరిశోధన కార్యకలాపాల్లో తమ సహకారం సంస్థకు మరింత బలాన్నిస్తుందని పేర్కొన్నారు. అల్యూమిని మరియు యూనివర్సిటీ మధ్య బలమైన అనుబంధం కొనసాగితే విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని, సమాజానికి ఉపయోగపడే నాణ్యమైన ఇంజినీర్లను తయారు చేయడం సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అల్యూమిని విద్యార్థిని లీల శ్రీ మాట్లాడుతూ తమ ఉద్యోగ జీవితానికి బలమైన పునాదిని అందించిన మిట్స్ యూనివర్సిటీ మరియు అనుభవజ్ఞులైన అధ్యాపకుల నాణ్యమైన బోధన, ఆధునిక ల్యాబ్ సౌకర్యాలు తమను పరిశ్రమ అవసరాలకు తగిన విధంగా తీర్చిదిద్దాయని అన్నారు. ప్రస్తుత విద్యార్థులు అవకాశాలను సద్వినియోగం చేసుకుని నిరంతరం నేర్చుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. భవిష్యత్తులో కూడా సంస్థ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని అన్నారు. కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ ఎం.శ్రీదేవి, అల్యూమిని రిలేషన్స్ ఆఫీసర్ డాక్టర్ జి.నాగాశ్వేత, కోఆర్డినేటర్ వి.గీత మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :