Tuesday, 15 September 2026 09:42:24 PM
# కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం

మిట్స్ లో యువ పార్లమెంట్ ప్రోగ్రాం

లెసెన్స్ ఫర్ ఇండియన్ డెమోక్రసీ పై చర్చా కార్యక్రమం

Date : 06 March 2026 10:17 PM Views : 225

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - మార్చి 06 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా నెహ్రు యువ కేంద్రం మరియు మిట్స్ ఎన్‌.ఎస్‌.ఎస్‌. వారి ఆధ్వర్యంలో “50 ఇయర్స్ ఆఫ్ ఎమర్జెన్సీ: లెసన్స్ ఫర్ ఇండియన్ డెమోక్రసీ” అనే అంశంపై యువ పార్లమెంట్ పోటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశంలో 50 సంవత్సరాల క్రితం విధించిన అత్యవసర పరిస్థితి సమయంలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు మరియు భవిష్యత్ రాజకీయాలలో యువత పాత్రపై విద్యార్థులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ పోటీ నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కురబలకోట ఎం.పి.డి.ఓ గంగయ్య మరియు నెహ్రు యువ కేంద్రం కోఆర్డినేటర్ ప్రదీప్ పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు, మిట్స్ యూనివర్సిటీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని “50 ఇయర్స్ ఆఫ్ ఎమర్జెన్సీ: లెసన్స్ ఫర్ ఇండియన్ డెమోక్రసీ” అంశంపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నెహ్రు యువ కేంద్రం కోఆర్డినేటర్ ప్రదీప్ మాట్లాడుతూ 1975 జూన్ 25న భారతదేశంలో ఎమర్జెన్సీ ప్రకటించబడిందని, ఆ సమయంలో పౌర హక్కులు నిలిపివేయబడ్డాయని, పత్రికా స్వేచ్ఛపై ఆంక్షలు విధించబడ్డాయని, ప్రతిపక్ష నాయకులు అరెస్టు చేయబడ్డారని తెలిపారు. అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ తీసుకున్న నిర్ణయం భారత ప్రజాస్వామ్యానికి ఒక పెద్ద పరీక్షగా మారిందని చెప్పారు. కార్యక్రమంలో ఎం.పి.డి.ఓ గంగయ్య మాట్లాడుతూ ఎమర్జెన్సీ సమయంలో తీసుకున్న నిర్ణయం భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక మాయని మచ్చగా నిలిచిపోయిందని, 1977లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్య శక్తిని చూపిందని తెలిపారు. ఈ సందర్భంగా రాజ్యాంగం సర్వోన్నతమని, అధికారంలో ఎవరు ఉన్నా రాజ్యాంగాన్ని గౌరవించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎన్‌.ఎస్‌.ఎస్‌. కోఆర్డినేటర్ పి. రాజేష్ మాట్లాడుతూ పత్రికా స్వేచ్ఛ, స్వతంత్ర న్యాయవ్యవస్థ, బలమైన ప్రతిపక్షం ప్రజాస్వామ్యానికి చాలా అవసరమని, దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉందని, ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించి ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని సూచించారు. కార్యక్రమంలో గెలుపొందిన 10 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో నిర్వహించే పోటీలలో పాల్గొనే అవకాశం పొందారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు నెహ్రు యువ కేంద్రం కోఆర్డినేటర్ ప్రదీప్, గ్రామజ్యోతి సొసైటీ అధ్యక్షురాలు సుభద్ర, అసిస్టెంట్ డీన్ ఏ.వి పవన్ కుమార్, డాక్టర్ పి.రమేష్ రెడ్డి, ఎన్‌.ఎస్‌.ఎస్‌. కోఆర్డినేటర్ పి. రాజేష్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :