నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - నవంబర్ 24 : శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం శాశ్వత ధర్మకర్తగా కాటంరెడ్డి రవీంద్రారెడ్డిని నియమించి ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొన్న. దేవాదాయ శాఖ మంత్రి ఆనం* ఆత్మకూరు పట్టణం బైపాస్ రోడ్డు వద్ద వెలిసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం ఆలయ ధర్మకర్త ప్రమాణ స్వీకారానికి హాజరైన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి.. ఆలయ ధర్మకర్తగా కాటంరెడ్డి రవీంద్రారెడ్డిని నియమిస్తూ నేడు ఆలయ ప్రాంగణంలో ప్రమాణ స్వీకారం నిర్వహించిన దేవాదాయ శాఖ అధికారులు.. మొదట వేద పండితుల,పూజారుల మంత్రంక్షల నడుమ పూర్ణకుంభంతో మంత్రి ఆనంకు ఘనంగా స్వాగతం పలికారు.. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆలయ నిర్వహణను కాటంరెడ్డి రవీంద్ర రెడ్డికి అప్పగిస్తూ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి ఆనం పాల్గొన్నారు..దేవాలయాల పరిరక్షణ చేపట్టడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని భక్తుల మనోభావాలకు గౌరవిస్తూ ఆధ్యాత్మికత ఉట్టిపడేలా రాష్ట్రంలో అన్ని దేవాలయాల నిర్వహణ చేపడుతున్నటువంటి మంత్రి ఆనం తెలిపారు.. ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులతో కాటంరెడ్డి రవీందర్ రెడ్డి ఈ దేవాలయం ను ఎంతో వైభవంగా వెలిగేలా కృషి చేయాలని ఈ ఆలయం అభివృద్ధి కి తాను పూర్తి సహకారం అందిస్తానని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు.. తమ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతి ఒక్క మతాల వారిని గౌరవిస్తూ అందరినీ సమానంగా చూస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ప్రాంత కూటమి నేతలు, అధికారులు, ప్రజలు భారీగా పాల్గొన్నారు
Admin
Namitha News