నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : క్యాంపస్ ప్లేస్ మెంట్ లో జ్ఞానాంబిక విద్యార్థుల సత్తా - 33 మందికి సియట్ టైర్స్ కంపెనీ లో ఉద్యోగాలు క్యాంపస్ ప్లేస్ మెంట్ లో శ్రీ జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల( అటానమస్) విద్యార్థులు సత్తా చాటారు. గురువారం కాలేజీలో నిర్వహించిన రిక్రూట్ మెంట్ ప్రక్రియలో, ప్రముఖ టైర్ల తయారీ సంస్థ సియట్ టైర్స్ కంపెనీలో కాలేజీకి చెందిన 33 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. కరస్పాండెంట్ డాక్టర్ రాటకొండ గురు ప్రసాద్ వివరాలను తెలిపారు. కళాశాలలో నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో 33 మంది విద్యార్థులు అసోసియేట్ ట్రెయినీ ఉద్యోగాలకు ఎంపికయ్యారన్నారు. సియట్ టైర్స్ సంస్థ హెచ్ఆర్ ప్రతినిధులు ఎలవరసన్, లోకేష్ రతీష్ విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. విద్యార్థుల ప్రతిభ, నైపుణ్యాలను పరిశీలించిన అనంతరం 33 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేశారు. ఎంపికైన వారికి ఏడాదికి రూ.3 లక్షల వేతనం అందనున్నట్లు కళాశాల యాజమాన్యం తెలిపింది. ఉద్యోగ విధులు చెన్నైలో నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొంది. విద్యతోపాటు విద్యార్థులకు ప్రముఖ పారిశ్రామిక సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఒకేసారి 33 మంది విద్యార్థులు ప్రముఖ సంస్థలో ఉద్యోగాలకు ఎంపిక కావడం కళాశాలకు, విద్యార్థులకు గర్వకారణమన్నారు. ఎంపికైన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ సురభి రమాదేవి, అధ్యాపకులు, సిబ్బంది అభినందించారు. ఫోటో ఉంది
Reporter
Namitha News