Thursday, 16 April 2026 03:21:33 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

మిట్స్ విద్యార్థులకు ఇంజినీరింగ్ విద్య లో ఆవిష్కరణలు, వ్యాపారోత్పత్తి పై అవగాహన

Date : 17 March 2026 07:59 PM Views : 89

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - మార్చి 17 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ మరియు డేటా సైన్స్) విభాగాల వారు సంయుక్తంగా ఏఐసిటిఈ (అఖిల భారత సాంకేతిక విద్యా మండలి), న్యూ ఢిల్లీ వారి సహకారంతో ఇంజినీరింగ్ విద్యలో ఆవిష్కరణలు మరియు వ్యాపారోత్పత్తి అభివృద్ధి అనే అంశం పై ఒక రోజు సాంకేతిక ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తమిళనాడుకు చెందిన అన్న యూనివర్సిటీ నందు మెకానికల్ విభాగం లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ ఎమ్.సత్య ప్రసాద్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ఇంజినీరింగ్ విద్య కేవలం తరగతి గది పాటలకే పరిమితం కాకుండా, ఆవిష్కరణలు మరియు వ్యవస్థాపకత కేంద్రంగా సరికొత్త దిశలో ముందుకు సాగాలని అన్నారు. నేటి ఇంజినీర్లు కేవలం డిగ్రీలు పొందే వారు మాత్రమే కాకుండా, సమాజంలోని సంక్లిష్ట సమస్యలకు సాంకేతిక పరిష్కారాలను కనుగొనే దిశగా ముందుకు సాగాలని అన్నారు. హ్యాకథాన్‌లు మరియు డిజైన్ థింకింగ్ వంటి వేదికల ద్వారా విద్యార్థులు తమ సృజనాత్మక ఆలోచనలను ప్రాథమిక నమూనాలుగా అభివృద్ధి చేయాలని అన్నారు. విదేశీ సాంకేతికతలను అనుసరించడం కంటే భారతీయ పరిస్థితులకు అనుగుణంగా, అవసరాలకు సరిపోయే విధంగా, తక్కువ ఖర్చుతో, స్థిరమైన పరిష్కారాలను రూపొందించాలని విద్యార్థులను ప్రోత్సహించారు. భారతీయ పరిస్థితులకు సరిపోయే సాంకేతికతలను అభివృద్ధి చేయడం ద్వారా దేశం స్వయం సమృద్ధి సాధించే దిశగా ముందుకు సాగుతుందని తెలుపారు. ఈ ప్రక్రియలో మిట్స్ యూనివర్సిటీ నందు బిజినెస్ ఇంక్యుబేటర్లు మరియు స్టార్టప్ హబ్‌లు విద్యార్థులకు మార్గదర్శకత్వం మరియు అవసరమైన వనరులు అందిస్తూ సాంకేతిక ప్రాజెక్టులను లాభదాయకమైన వ్యాపారాలుగా మార్చడంలో సహకరిస్తున్నాయని అన్నారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కృత్రిమ మేధ (AI), గ్రీన్ ఎనర్జీ మరియు సెమీకండక్టర్ల వంటి ఆధునిక రంగాల అభివృద్ధికి ప్రోత్సాహకాలు అందిస్తున్నాయని, విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, డీన్-స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్ చంద్ర ప్రకాష్ గుప్తా , విభాగాధిపతులు డాక్టర్ ఆర్ కల్పనా, ఎస్.కుసుమ, కోఆర్డినేటర్ డాక్టర్ ఏ.పుంగోదై, డాక్టర్ కె.నిర్మల దేవి, డాక్టర్ చొక్కనాథన్, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :