Thursday, 30 July 2026 07:28:41 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా మాకే ప్రజాదరణ - ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి

Date : 11 December 2025 08:17 PM Views : 363

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 11 : ప్రభుత్వం ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా ప్రజాదరణ మా పార్టీకే ఉందని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి హర్షద్వానాల మధ్య ప్రకటించారు. గురువారం ఆయన స్వగృహంలో తంబళ్లపల్లె ఎంపీపీగా ఎన్నికైన చిటికి శ్యామలా కోటిరెడ్డి, ఎంపీటీసీలను సన్మానించి అభినందించారు. ఆరు మండలాల నాయకులు, కార్యకర్తల మధ్య విజయోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం సకాలంలో జరగవలసిన ఎంపీపీ ఉప ఎన్నికలను కావాలని కుట్రతో వాయిదా వేస్తూ వస్తున్నారని అయినా తంబళ్లపల్లె ఎంపీపీగా శ్యామలా కోటిరెడ్డి ఎన్నిక మా విజయానికి నిదర్శనమన్నారు. బి కొత్తకోట ఎంపీపీ ఎన్నిక వాయిదా పై విమర్శిస్తూ అక్కడ కూడా విజయం మాదేనని ధీమాగా చెప్పారు. తంబళ్లపల్లె చరిత్రలో నిలిచిపోయే మల్లయ్య కొండ రోడ్డు, పిఆర్ గెస్ట్ హౌస్, పెద్దేరు ప్రాజెక్టు పార్కు అభివృద్ధి, బెంగళూరుకు బస్సు సౌకర్యం, సిహెచ్సీ అదనపు భవనాలు, ఆలయాల నిర్మాణం, ప్రతి గ్రామానికి లింకు రోడ్లు, సిమెంటు రోడ్లు, జగనన్న కాలనీలు, సచివాలయాలు, ఆర్ బి కే సెంటర్లు, విలేజ్ క్లినిక్స్ నిర్మాణం, ఇంకా పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాలు అందించినట్లు చెప్పారు. నేడు కూటమి ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టక పోగా మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసి విద్యార్థులకు వైద్య విద్య అమ్మకానికి పెట్టి ప్రజాగ్రహానికి గురైనట్లు చెప్పారు. తంబళ్లపల్లెలో చేపట్టిన కోటి సంతకాల సేకరణకు ప్రజల నుండి విశేష స్పందన లభించిందని కూటమి ప్రభుత్వం అన్ని రంగాలలో పాలనలో విఫలమైనట్లు విమర్శించారు. ఈ కార్యక్రమంలో.రియల్టర్ గోపి దిన్ని మల్లికార్జున రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు రేపన చౌడేశ్వర, కిషోర్ కుమార్ రెడ్డి, ఆరు మండలాల వైకాపా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: