Monday, 08 June 2026 09:53:37 AM
# తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు # అక్రమ కేసు పై నిరాహార దీక్ష కు మాజీ ఎంపీ రెడ్డెప్ప # నిశ్వార్థమైన కళ @ నృత్యం - తెలుగు యువత రాష్ట్రా అధ్యక్షులు # ప్రకృతి పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత - ఇన్చార్జ్ ఎంపీడీవో ఎంవీ ప్రసాద్ # జల్జీవన్ మిషన్ తో ప్రతి ఇంటి తాగునీటి కష్టాలకు చెక్ # చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటుకు కదం తొక్కిన వైకాపా శ్రేణులు # మిట్స్ లోని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ను సందర్శించిన అధికారులు # ఫౌండేషన్ లిటరాసి అండ్ న్యూమరసీ శిక్షణ

కాలేయ వ్యాధి తో దిన దిన గండం గా అపశయ్య పై అమరనాథరెడ్డి

కర్పూర హారతిలా వైద్య ఖర్చు - ఆపన్న హస్తం కోసం ఎదురుచూపులు

Date : 18 March 2026 08:09 PM Views : 151

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 18 : ఓ మధ్యతరగతి రైతుబిడ్డ కొద్దో గొప్పో చదువుకుని ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆయన పాలిట కాలేయ వ్యాధి కాలయముడై ప్రాణాన్ని కబలిస్తున్న దయనీయ సంఘటన మండలంలో చోటుచేసుకుంది. తంబళ్లపల్లె మండలం కోసువారి పల్లి పంచాయతీ నల్ల తిమ్మిరెడ్డి గారి పల్లెకు చెందిన వెంకటరమణారెడ్డి కుమారుడు అమరనాథరెడ్డిది ఓ మధ్యతరగతి రైతు కుటుంబం. అమరనాథరెడ్డి చదువు ముగించుకుని బెంగళూరులో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగంలో చేరి తన భార్య పద్మావతి, ఏడేళ్ల చిన్నారితో కె ఆర్ పురం లో ఓ అద్దె ఇంట్లో సంతోషంగా జీవనం సాగించేవారు. ఈ పచ్చటి సంసారం సాగుతుండగా రెండేళ్ల క్రితం అమరనాథ్ రెడ్డికి ఊపిరితిత్తుల సమస్య ఏర్పడింది. అప్పట్లో కుటుంబ సభ్యులు బెంగళూరు ప్రైవేట్ ఆస్పత్రిలో లక్షలు ఖర్చుచేసి వైద్యం చేయించారు. ఆరోగ్యం కుదుటపడి యధావిధిగా తన ఉద్యోగ బాధ్యతలు నిర్వహించుకుంటూ కాలం వెలదీస్తుండగా మరో మారు అమర్నాథరెడ్డి పై ప్రకృతి పగబట్టి కాలేయ వ్యాధి రూపంలో దాపురించింది. గత పది రోజులుగా బెంగళూరు లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సుమారు మూడు లక్షలు ఖర్చు చేసిన ఫలితం లేక బెంగళూరు సెన్ జాన్స్ ఆస్పత్రిలో చికిత్సలకు చేర్చారు. కాలేయం పూర్తిగా దెబ్బ తినడంతో అప్పులు చేసి చికిత్సలు చేయించడంతో డబ్బు కర్పూర హారతిలా కరిగిపోతోంది తప్ప ఆరోగ్యం కుదుటపడలేదు. ప్రస్తుతం అమరనాథరెడ్డిని ఐసీయూలో ఉంచి వారానికి డయాలసిస్ కోసం రెండున్నర నుండి మూడు లక్షల వరకు ఖర్చు చేయాల్సి రావడంతో ఆ కుటుంబం నిర్గాంతపోయింది. అమర్నాథ్ రెడ్డి దయనీయ స్థితిని చూసి భార్య పద్మావతి, కుటుంబ సభ్యులు ఆ దేవుని మీద భారం వేసి ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. అమరనాథ్ రెడ్డి లివర్ ఆపరేషన్ కోసం ఇంకా 30 లక్షల వరకు అవసరం ఉంటుందని డాక్టర్లు తెలపడంతో కుటుంబ సభ్యులు దిక్కు తోచని స్థితిలో పడ్డారు. ఎంతోమందికి ప్రాణదానం చేస్తున్న కూటమి ప్రభుత్వం అమరనాథరెడ్డి వైద్యానికి సహకరించాలని తంబళ్లపల్లె మండల టిడిపి నేతలు కోరుకుంటుండగా మనసున్న మారాజులు ఆదుకుంటారేమోనని అమర్నాథ్ రెడ్డి కుటుంబం వేయికళ్ళతో ఎదురుచూస్తోంది

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :