Sunday, 13 September 2026 05:59:15 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

కాలేయ వ్యాధి తో దిన దిన గండం గా అపశయ్య పై అమరనాథరెడ్డి

కర్పూర హారతిలా వైద్య ఖర్చు - ఆపన్న హస్తం కోసం ఎదురుచూపులు

Date : 18 March 2026 08:09 PM Views : 231

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 18 : ఓ మధ్యతరగతి రైతుబిడ్డ కొద్దో గొప్పో చదువుకుని ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆయన పాలిట కాలేయ వ్యాధి కాలయముడై ప్రాణాన్ని కబలిస్తున్న దయనీయ సంఘటన మండలంలో చోటుచేసుకుంది. తంబళ్లపల్లె మండలం కోసువారి పల్లి పంచాయతీ నల్ల తిమ్మిరెడ్డి గారి పల్లెకు చెందిన వెంకటరమణారెడ్డి కుమారుడు అమరనాథరెడ్డిది ఓ మధ్యతరగతి రైతు కుటుంబం. అమరనాథరెడ్డి చదువు ముగించుకుని బెంగళూరులో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగంలో చేరి తన భార్య పద్మావతి, ఏడేళ్ల చిన్నారితో కె ఆర్ పురం లో ఓ అద్దె ఇంట్లో సంతోషంగా జీవనం సాగించేవారు. ఈ పచ్చటి సంసారం సాగుతుండగా రెండేళ్ల క్రితం అమరనాథ్ రెడ్డికి ఊపిరితిత్తుల సమస్య ఏర్పడింది. అప్పట్లో కుటుంబ సభ్యులు బెంగళూరు ప్రైవేట్ ఆస్పత్రిలో లక్షలు ఖర్చుచేసి వైద్యం చేయించారు. ఆరోగ్యం కుదుటపడి యధావిధిగా తన ఉద్యోగ బాధ్యతలు నిర్వహించుకుంటూ కాలం వెలదీస్తుండగా మరో మారు అమర్నాథరెడ్డి పై ప్రకృతి పగబట్టి కాలేయ వ్యాధి రూపంలో దాపురించింది. గత పది రోజులుగా బెంగళూరు లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సుమారు మూడు లక్షలు ఖర్చు చేసిన ఫలితం లేక బెంగళూరు సెన్ జాన్స్ ఆస్పత్రిలో చికిత్సలకు చేర్చారు. కాలేయం పూర్తిగా దెబ్బ తినడంతో అప్పులు చేసి చికిత్సలు చేయించడంతో డబ్బు కర్పూర హారతిలా కరిగిపోతోంది తప్ప ఆరోగ్యం కుదుటపడలేదు. ప్రస్తుతం అమరనాథరెడ్డిని ఐసీయూలో ఉంచి వారానికి డయాలసిస్ కోసం రెండున్నర నుండి మూడు లక్షల వరకు ఖర్చు చేయాల్సి రావడంతో ఆ కుటుంబం నిర్గాంతపోయింది. అమర్నాథ్ రెడ్డి దయనీయ స్థితిని చూసి భార్య పద్మావతి, కుటుంబ సభ్యులు ఆ దేవుని మీద భారం వేసి ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. అమరనాథ్ రెడ్డి లివర్ ఆపరేషన్ కోసం ఇంకా 30 లక్షల వరకు అవసరం ఉంటుందని డాక్టర్లు తెలపడంతో కుటుంబ సభ్యులు దిక్కు తోచని స్థితిలో పడ్డారు. ఎంతోమందికి ప్రాణదానం చేస్తున్న కూటమి ప్రభుత్వం అమరనాథరెడ్డి వైద్యానికి సహకరించాలని తంబళ్లపల్లె మండల టిడిపి నేతలు కోరుకుంటుండగా మనసున్న మారాజులు ఆదుకుంటారేమోనని అమర్నాథ్ రెడ్డి కుటుంబం వేయికళ్ళతో ఎదురుచూస్తోంది

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: