Monday, 08 June 2026 09:57:14 AM
# తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు # అక్రమ కేసు పై నిరాహార దీక్ష కు మాజీ ఎంపీ రెడ్డెప్ప # నిశ్వార్థమైన కళ @ నృత్యం - తెలుగు యువత రాష్ట్రా అధ్యక్షులు # ప్రకృతి పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత - ఇన్చార్జ్ ఎంపీడీవో ఎంవీ ప్రసాద్ # జల్జీవన్ మిషన్ తో ప్రతి ఇంటి తాగునీటి కష్టాలకు చెక్ # చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటుకు కదం తొక్కిన వైకాపా శ్రేణులు # మిట్స్ లోని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ను సందర్శించిన అధికారులు # ఫౌండేషన్ లిటరాసి అండ్ న్యూమరసీ శిక్షణ

క్రమశిక్షణ,పట్టుదల,ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి - విద్యార్థులకు విద్యాసంస్థల అధినేతల సూచనలు - ఘనంగా శ్రీసాయి చైతన్య జూనియర్ కళాశాల ఫేర్వెల్ డే

Date : 29 January 2026 08:13 PM Views : 141

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : క్రమశిక్షణ,పట్టుదల,ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి - విద్యార్థులకు విద్యాసంస్థల అధినేతల సూచనలు - ఘనంగా శ్రీసాయి చైతన్య జూనియర్ కళాశాల ఫేర్వెల్ డే - అబ్బురపరిచిన విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు మదనపల్లె : క్రమశిక్షణ,పట్టుదల,ఆత్మస్థైర్యంతో విద్యార్థులు ముందుకు సాగి అద్భుత విజయాలను అందుకోవాలని విద్యార్థులకు పలు విద్యాసంస్థల అధినేతలు సూచించారు.గురువారం శ్రీ సాయి చైతన్య జూనియర్ కళాశాల ఫేర్వెల్ డే వేడుకలు బైపాస్ రోడ్డులోని శ్రీ రామ తులసమ్మ కన్వెన్షన్ హాల్ నందు అంగరంగ వైభవంగా జరిగాయి.ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా విద్యోదయ హైస్కూల్ కరస్పాండెంట్ పి.శ్రీనివాసులు,న్యూలిటిల్ ఫ్లవర్ హైస్కూల్ కరస్పాండెంట్ రామకృష్ణారెడ్డి,విఎస్ఆర్ గ్రాండ్స్ అధినేత వి.సుధాకర్ రెడ్డి,పిఎన్ఆర్ ప్రాపర్టీస్ సిఎండి కె.ప్రణీత్ రెడ్డి,విశ్వం డిగ్రీ కళాశాల డీన్ శ్రీనివాసులు రెడ్డి,గాయత్రి డిగ్రీ కళాశాల చైర్మన్ శంకర్ రెడ్డి,విజేత కోచింగ్ సెంటర్ డైరెక్టర్ శంకర్ యాదవ్,ప్రముఖ గాయిని భూదేవి,ప్రముఖ మోటివేటివ్ స్పెషలిస్ట్ రామ్మూర్తి,శ్రీ గుడ్విల్ కంప్యూటర్స్ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ కుమార్ తదితరులు హాజరయ్యారు.ముందుగా అతిథులకు కళాశాల చైర్మన్ కే.నిర్మల్ కుమార్ రెడ్డి,సీఈఓ ఎం.రాజేశ్వర్ రెడ్డి,డీన్ ఎం.పురుషోత్తం,ప్రిన్సిపాల్ ఆర్.ధనుంజయ రెడ్డి,వైస్ ప్రిన్సిపాల్ వై.నరసింహులు అపూర్వ స్వాగతం పలికారు.ముందుగా జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ఉన్నత చదువులకు వెళ్లాలంటే ఇంటర్మీడియట్ నందు విద్యార్థులు మంచి మార్కులు సాధించి గట్టి పునాది వేసుకోవాలన్నారు.చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఓ ప్రణాళిక బద్ధంగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.శ్రీసాయి చైతన్య జూనియర్ కళాశాల ఇంటర్మీడియట్ విద్యలో నూతన ఒరవడిని సృష్టిస్తోందని ప్రశంసించారు.అనంతరం కళాశాల చైర్మన్ నిర్మల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అనుభవం కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన చేస్తూ ప్రతి ఏడాది అత్యుత్తమ ఫలితాలు సాధిస్తుండడం గర్వంగా ఉందన్నారు.అదేవిధంగా ఇంటి వాతావరణాన్ని తలపించే వసతి గృహాలు మా ప్రత్యేకత అన్నారు.సాధారణ విద్యార్థులచే ప్రతి ఏడాది అసాధారణ ఫలితాలు సాధిస్తుండడం గర్వంగా ఉందన్నారు.తమ కళాశాల అభివృద్ధికి అన్నివిధాలా సహకరిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు,అధ్యాపకులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.అనంతరం విద్యార్థిని,విద్యార్థులచే ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :