నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ లో అన్నదాన వితరణ చేసిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏబీఓ కిరణ్ మరియు వారి కుటుంబ సభ్యులు మే రెండవ తేదీ శనివారం చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ చే నడపబడుతున్న ఆనంద వృద్ధాశ్రమం మరియు అనాధాశ్రమములలో ఏబీఓ కిరణ్ మరియు పాలెం స్వాతి గార్ల తాతగారు కీర్తిశేషులు శ్రీ జి బాల చిన్నప్ప గారి నాలుగవ వర్ధంతి సందర్భంగా పోషక విలువలతో కూడిన మాంసాహార భోజనం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా కిరణ్ గారి సోదరి స్వాతి గారు తిరుపతి రుయా హాస్పిటల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సురేందర్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు అందరూ ఈ అన్నదాన వితరణలో పాల్గొని స్వయంగా వడ్డించి మా తాతగారి జ్ఞాపకాలను ఈ చిన్నారులు మరియు ఇక్కడ సేద తీరుతున్న వయోజనులైనటువంటి అవ్వ తాతల ముఖాలలో చూసుకుంటున్నామని అన్నారు సొంత లాభం కొంతమంది తోటి వారికి తోడ్పడవోయ్ అని నేర్పించిన మా తాతగారు మాకు భౌతికంగా దూరమైన మానసికంగా మా గుండె గుడిలో దీపమై వెలుగుతున్నారని ఆయన పెంచి ప్రవర్తమానం చేసినటువంటి ఆ క్రమశిక్షణే ఈరోజు ఈ విధంగా మేము ఉండడానికి కారణమని కాబట్టి విద్యకు మించిన ఆయుధం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు చదువుకొని అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో అడ్మిన్ డైరెక్టర్ డాక్టర్ జివిఎస్ బాబు జనరల్ సెక్రెటరీ కవిత రాణి గారితో పాటు శ్రీ ఎంపీ ఆనందన్ గారు వ్యవస్థాపక అధ్యక్షులు ఆనంద వృద్ధాశ్రమం బి కే పల్లి సిబ్బంది చైతన్య అనాధాశ్రమం దేవత నగర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News