నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పీలేరులో దివ్యాంగుల సాధికారతకు తోడ్పడేలా రాష్ట్ర వ్యాప్త ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమాన్ని పీలేరు బస్టాండ్లో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్రెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దివ్యాంగుల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం ద్వారా వారికి రవాణా సౌకర్యం సులభతరం అవుతుందన్నారు.
Reporter
Namitha News