నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - డిసెంబర్ 02 : అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం లోని మేజర్ పంచాయతీ చెంబకూరు గ్రామం లో మంగళవారం జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు చెంబకూరు గ్రామంలో పర్యటించి స్థానికులతో నేరుగా ముచ్చటించి వివిధ నేరాలపై భద్రత ప్రమాణాలపై లోతైన అవగాహన కార్యక్రమం నిర్వహించిన ఎస్సై రమేష్ బాబు . ఈ సందర్బంగా ఎస్సై మాట్లాడుతూ పెరుగుతున్న సైబర్ మోసాలు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అపరచితుల కాల్స్ కు స్పందించే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.సోషల్ మీడియా ఫేస్ బుక్, ఇన్స్ట్రాగ్రామ్,కు యువత ఎక్కువగా బానిసలుగా అవుతున్నారని తల్లి దండ్రులు వారిపై ఒక కన్ను వేసివుంచాలని పిల్లలు ఎవరి ఎవరికీ కాల్ చేస్తున్నారా, చాటింగ్ చేస్తున్నారా, ఆన్ లైన్ గేమ్ లు ఆడుతున్నార అని ఫోన్ చెక్ చేయాలని, ఫోన్ లాక్ ఎందుకు పెడుతున్నావని కుటుంబ సభ్యులను అడగాలన్నారు. మొబైల్ బెట్టింగ్ వల్ల ఎన్నో జీవితాలు నాశనం అయ్యాయని వాటి జోలికి వెళ్ళకండన్నారు. గ్రామంలో ఎవరైనా అపరిచితులు సంచారం చేయడం, దొంగతనాలకు ఆస్కారం ఉంటుందని, అటువంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అపరిచితుల నుండి బెదిరింపులు కాల్స్ రాగానే వారి ఫోటో సెల్ తో తీసి పోలీసులకు తెలియజేయాలన్నారు. సైబర్ క్రైమ్ పట్ల గ్రామీణ ప్రజలకు ఈ సందర్భంగా అవగాహన కల్పించారు.ప్రతివాహన దారులు మద్యం సేవించి నడపరాదని హెల్మెట్ ధరించి ప్రాణాలను రక్షించు కోవాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్సై డి. రమేష్ బాబు పోలీస్ సిబ్బంది రాజేష్, ఖాజాఫీర్, మహిళా పోలీస్ చందన, సీనియర్ టిడిపినాయకులు తిప్పన్న, రాంమూర్తి, నిసార్,ఫ్రూప్ట్స్ ఉస్మాన్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Reporter
Namitha News